News January 27, 2025
మేడ్చల్: మాకూ రూ.12 వేలు ఇవ్వండి!

భూమిలేని నిరుపేదలైన వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా జనవరి 21 నుంచి 24 వరకు జరిగిన గ్రామ, వార్డు సభల్లో వ్యవసాయ కూలీలు తమకు సైతం భూమిలేదని, పథకం అందించాలని 1,245 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. గత దరఖాస్తుల్లో ఇప్పటికే 1,074 మంది అర్హులుగా గుర్తించారు.
Similar News
News December 21, 2025
అబార్షన్ తర్వాత ఈ జాగ్రత్తలు

అబార్షన్ జరిగిన తర్వాత డాక్టర్ సూచన మేరకు పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వేసుకోవాలి. పాలు, బ్రెడ్, పళ్లు, ఆకు కూరలు, కాయగూరలు, పప్పు దినుసులు, డ్రైఫ్రూట్స్తో మంచి ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల మంచి నీళ్లు తాగాలి. అధిక రక్తస్రావం, దుర్వాసన, కడుపునొప్పి ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి. అలాగే మూత్రంలో మంట, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తున్నా అశ్రద్ధ చేయకూడదు.
News December 21, 2025
ఉమ్మడి తూ.గో. జిల్లా టీడీపీ అధ్యక్షులు వీరే..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులను పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేసి, వారి పేర్లను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షునిగా గుత్తుల సాయి ప్రసాద్ ను నియమించారు. కాకినాడ జిల్లా అధ్యక్షునిగా జ్యోతుల నవీన్ పేరును ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షునిగా బొడ్డు వెంకటరమణ చౌదరిని ఖరారు చేశారు. ప్రధాన కార్యదర్శులను కూడా ప్రకటించారు.
News December 21, 2025
ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ వర్సిటీలో టీచింగ్ పోస్టులు

AP: ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 7 టీచింగ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BSc, MSc(హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, హ్యూమన్ డెవలప్మెంట్ & ఫ్యామిలీ స్టడీస్), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు(M), మహిళలకు 45ఏళ్లు. అర్హతగల వారు ఈనెల 29, 30 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. వెబ్సైట్: https://angrau.ac.in


