News January 27, 2025
మేడ్చల్: మాకూ రూ.12 వేలు ఇవ్వండి!

భూమిలేని నిరుపేదలైన వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా జనవరి 21 నుంచి 24 వరకు జరిగిన గ్రామ, వార్డు సభల్లో వ్యవసాయ కూలీలు తమకు సైతం భూమిలేదని, పథకం అందించాలని 1,245 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. గత దరఖాస్తుల్లో ఇప్పటికే 1,074 మంది అర్హులుగా గుర్తించారు.
Similar News
News October 13, 2025
జీఎస్టీ 2.0 తో ప్రజలకు ఊరట: కలెక్టర్

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం వై జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు కలెక్టర్ కీర్తి చేకూరి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. జీఎస్టీ 2.0 అమలుతో ప్రజలకు ఊరట లభిస్తోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తెచ్చిందని వివరించారు.
News October 13, 2025
మందమర్రి: ఏరియాలో పర్యటించిన సింగరేణి డైరెక్టర్

మందమర్రి సింగరేణి ఏరియా కేకే ఓపెన్ కాస్ట్ గనిని సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ఏరియా జీఎం రాధాకృష్ణతో కలిసి సందర్శించారు. ప్రాజెక్ట్ స్థితిగతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఓబీ ప్లాంట్ వ్యూ పాయింట్ను పరిశీలించారు. మైనింగ్ కార్యకలాపాలను వీక్షించారు. కృషి పట్టుదలతో ఏదైనా సాధ్యమని, విజయాన్ని ఉద్యోగులు, కార్మికులు ప్రేరణ తీసుకోవాలన్నారు.
News October 13, 2025
మంచిర్యాల: నల్ల జెండాలతో నిరసన

సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై జరిగిన దాడి నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నల్లజెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతదేశ అత్యున్నత ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరగడం అంటే భారతదేశం మీద దాడి జరిగినట్టే అన్నారు. దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.