News January 27, 2025

మేడ్చల్: రైతు భరోసా కోసం 378 దరఖాస్తులు

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన గ్రామ, వార్డు సభల్లో రైతు భరోసా పథకానికి సంబంధించి రైతుల నుంచి తీసుకున్న దరఖాస్తుల రిపోర్టును అధికారులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 378 మంది రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తులు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. రైతుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం, ప్రభుత్వానికి ఈ వివరాలను పంపనున్నారు. 

Similar News

News December 9, 2025

వరంగల్: 32 మంది డాక్టర్లు.. రూ.100 కోట్లు ఫట్

image

ఉమ్మడి WGLలో వైద్యుల అత్యాశ సైబర్ నేరగాళ్లకు కలిసి వచ్చింది. పరకాలలో వెలుగు చూసిన రూ.2.51 కోట్ల సైబర్ కేసు తర్వాత అలాంటి ఘటనలే వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 32 మంది వైద్యులు సైబర్ వలకు చిక్కారు. MONARCH FIN యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలని, పెట్టుబడిపై 5 నుంచి 20 శాతం అదనంగా చెల్లిస్తామని వాట్సాప్ గ్రూపుల్లో వల వేయడంతో 32 మంది వైద్యులు చిక్కారు. రూ.100 కోట్లకు పైనే కొల్లగొట్టినట్లు సమాచారం.

News December 9, 2025

మెదక్: నేడు 5 వరకే మొదటి విడత ప్రచారం

image

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే జరగనుంది. మొదటి విడతలో హవేలి ఘనపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గ్, పెద్దశంకరంపేట్, రేగోడ్ మండలాల్లో 160 పంచాయతీలో 16 సర్పంచ్ స్థానాలతోపాటు పలు వార్డు స్థానాలు ఏకగ్రీవమాయ్యాయి. 144 పంచాయతీలలో ఈనెల 11న పోలింగ్, సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు చేయనున్నారు.

News December 9, 2025

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటే: కిషన్ రెడ్డి

image

తెలంగాణలో గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి సాధించిందని ‘ప్రజాపాలన విజయోత్సవాలు’ జరుపుకుంటున్నారో సీఎం రేవంత్ ప్రజలకు వివరణ ఇవ్వాలని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి డిమాండ్‌ చేశారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పదేళ్లలో చేసిందంతా కాంగ్రెస్ ప్రభుత్వం రిపీట్ చేస్తుందని విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు, అవినీతిలో కాంగ్రెస్ ముందుందని ఆయన ఎద్దేవా చేశారు.