News February 1, 2025
మేడ్చల్: సరైన సంఖ్యలో రైళ్లు లేక తప్పని తిప్పలు!

మేడ్చల్ రైల్వే స్టేషన్ ప్రాంతానికి సరైన సంఖ్యలో రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు MMTS రైళ్లను సైతం సర్దుబాటు చేయాలని, మేడ్చల్ ప్రాంతం నుంచి సిటీ లోపలికి వెళ్లే వారికి సైతం MMTS సేవలు మరింత మెరుగ్గా అదే విధంగా తగిన చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గతంలో ఈ విషయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
జగిత్యాల: రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ నల్లగుట్ట చౌరస్తా వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. బైక్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో గొల్లపల్లి మండలం శేకల్లకు చెందిన అరుణ్(21) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే బైక్పై ఉన్న మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
News November 17, 2025
అరకు, లంబసింగిలో కారవాన్ పార్కులు

ఏపీలో మొదటిసారిగా అరకు, లంబసింగి, సూర్యలంక బీచ్లలో కారవాన్ పార్క్లు ఏర్పడనున్నాయి. పర్యాటకులకు చిన్న మొబైల్ హౌస్లా ఉండే కారవాన్ల్లో సురక్షితంగా ఉండే అవకాశం కలుతుందని అధికారులు తెలిపారు. లంబసింగిలో పైలట్గా 10-15 ఈ-కారవాన్ వాహనాలు అందించనున్నారు. మొత్తం మూడు పార్కులకు రూ.15 కోట్లు పెట్టుబడి పెట్టబడుతోంది. హోటల్ సౌకర్యాలు తక్కువైన ప్రాంతాల్లో ఇది కొత్త అనుభవం కానుంది.
News November 17, 2025
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు

MLAల పార్టీ ఫిరాయింపు ఇతర పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్పై స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు MLAలపై 3నెలల గడువులో ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని, 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే కేసును పాస్ ఓవర్ చేయాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. దీంతో సుప్రీంకోర్టు పాస్ ఓవర్ చేసింది. ఈరోజు సాయంత్రం కేసును విచారించే అవకాశం ఉంది.


