News January 26, 2025
మేడ్చల్: 34,719 రేషన్ కార్డులకు సభల్లో ఆమోదం!

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రత్యేక గ్రామ, వార్డు సభలు ఇటీవల నిర్వహించిన అనంతరం తాజాగా రిపోర్టు వెల్లడైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం రేషన్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్న 34,719 మంది వివరాలను గ్రామ, వార్డు సభల్లో ఉంచారు. అనంతరం ఆమోదం సైతం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. మరోవైపు అదే సభల్లో మరి కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News March 14, 2025
HMDA పరిధిలోకి నల్గొండ ప్రాంతాలు

హెచ్ఎండీఏ పరిధి విస్తరణను తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోకి నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని గట్టుప్పల్, మర్రిగూడ, నాంపల్లి.. ఈ మూడు మండలాలలోని 11 గ్రామాలను కలిపారు.
News March 14, 2025
భీమ్గల్: మహిళ ఆత్మహత్య

ఆత్మహత్య చేసుకోని మహిళ మృతి చెందిన ఘటన భీమ్గల్ మండలం చేంగల్లో చోటు చేసుకుంది. SI మహేశ్ ప్రకారం.. శారద అనే మహిళ కూతురితో చేంగల్లో నివాసం ఉంటుంది. భర్త చనిపోవడంతో ఇంటి బాధ్యతలు తానే చుసుకుంటోంది. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఈ నెల 12న నాప్తలీన్ బాల్స్ మింగి ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం ఆర్మూర్ ఆస్పత్రిలో చేర్చగా ఈ నెల 13న మృతి చెందింది. కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
News March 14, 2025
బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన Way2News

కర్నూలు జిల్లా గోనెగండ్లలోని గంజల్ల రోడ్డు సమీపంలో 3ఏళ్ల <<15748871>>బాలుడు<<>> సంచరిస్తుండగా కోటేశ్వరరావు అనే వ్యక్తి ఆ బాలుడిని గోనెగండ్ల పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో బాలుడి సంబంధీకులు తమన సంప్రదించాలని కోరారు. ఈ విషయాన్ని Way2News ప్రచురించింది. విషయం తెలుసుకుని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు చేరుకుని బాలుడిని తీసుకువెళ్లారు. తమ బిడ్డ ఆచూకీకి సహకరించిన Way2Newsకు వారు కృతజ్ఞతలు తెలిపారు.