News January 26, 2025

మేడ్చల్: 4,222 ఎకరాలకు రైతు భరోసా డౌటే..!

image

మేడ్చల్ మండలం వ్యాప్తంగా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు రైతు భరోసా కోసం ప్రత్యేక వివరాలు సేకరించారు. సాగుకు యోగ్యంగా లేని 4,222 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలిపారు. ప్రభుత్వం రైతు భరోసా కింద సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే ప్రతి కారులో ఎకరాకు రూ.6,000 చొప్పున చెల్లిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సాగుకు యోగ్యంగా లేని భూములకు రైతు భరోసా రావడం డౌటే.

Similar News

News October 29, 2025

GNT: డెల్టా రైలు ప్రమాదం.. మర్చిపోలేని విషాదం

image

2005 అక్టోబర్‌ 29న వలిగొండ వద్ద జరిగిన డెల్టా రైలు ప్రమాదం గుంటూరు జిల్లా ప్రజలకు మర్చిపోలేని పీడకల. రేపల్లె-సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ రైలుకు జిల్లా ప్రజలతో సన్నిహిత అనుబంధం ఉంది. వలిగొండ-రామన్నపేట మధ్య ఉన్న వంతెన వరదలో కొట్టుకుపోవడంతో, రైలు ఇంజిన్‌తో సహా 7 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘోర దుర్ఘటనలో నిద్రిస్తున్న ప్రయాణికులలో దాదాపు 116 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు.

News October 29, 2025

RR: వర్షంలో పశువులను బయటికి వదలొద్దు: JD

image

విపత్కర పరిస్థితుల్లో పశువులకు కావాల్సిన మందులు, ఎమర్జెన్సీ వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ JD మధుసూదన్ సూచించారు. వర్షాల కారణంగా పశువులకు ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉచితంగా అందే ప్రభుత్వ మందులను వాడాలని తెలిపారు. జలగ వ్యాధులు రాకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా చిన్న దూడలు, ముసలి పశువులు, వర్షంలో బయటకి వదలొద్దని కోరారు.

News October 29, 2025

కాసేపట్లో మ్యాచ్.. రికార్డుల్లో మనదే పైచేయి!

image

ఈరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు ఆస్ట్రేలియాVsభారత్ తొలి T20 ప్రారంభం కానుంది. అయితే ఆసీస్‌పై పొట్టి క్రికెట్లో మనదే పైచేయి. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు ఇండియా టీ20 సిరీస్ కోల్పోలేదు. 2012లో 1-1తో సమం కాగా 2016లో 3-0 తేడాతో గెలిచింది. 2018లో మళ్లీ 1-1తో సమం చేయగా 2020లో 2-1తో సిరీస్ సాధించింది. ఇక AUS-IND మధ్య జరిగిన చివరి 8 మ్యాచుల్లో భారత్ ఏడింట్లో గెలవడం విశేషం.