News February 20, 2025
మేడ్చల్: BRS పార్టీకి ఎన్నికల్లో నిలబడే ముఖం లేదు: ఈటల

మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ HNK కమలానగర్లో మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు BRS పార్టీ అభ్యర్థులను నిలబెట్టే సాహసం చేయలేదని, గత ప్రభుత్వంలో వారు విద్యార్థులను ఇబ్బందులు పెట్టారన్నారు. ఐదు డీఏలు ఇవ్వలేదని, 317జీవోను సవరించలేదని, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ప్రయోజనాలు ఇవ్వలేక, వారికి పోటీ చేసే ముఖం లేదన్నారు. ఈ నెల 27న ఎన్నికలు జరగబోతున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
HYD: రాహుల్ ద్రవిడ్తో ఫ్రీడం ఆయిల్ ‘కోచింగ్ ది కోచ్’

ప్రముఖ వంట నూనె బ్రాండ్లలో ఒకటైన ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో రాహుల్ ద్రవిడ్ ప్రముఖంగా కనిపిస్తారని ఆ సంస్థ తెలిపింది. DRS (డిసీషన్ రివ్యూ సిస్టమ్) VS PRS (ప్యాక్ రివ్యూ సిస్టమ్)తో ప్రచారం చేయనుంది. ఈ భావనను ఉపయోగించి తమ కొత్త ‘కోచింగ్ ది కోచ్’ ప్రచారాన్ని ప్రారంభించింది. వినియోగదారులకు లీటర్ ఆయిల్ ప్యాకెట్ 910గ్రా. బరువుండాలని అవగాహన కల్పించనుంది.
News November 20, 2025
iBOMMA Oneపై పోలీసుల రియాక్షన్

iBOMMA One పైరసీ వెబ్సైట్పై సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఆ సైట్లో కొత్త సినిమాలు పైరసీ సినిమాలు లేవని తెలిపారు. సినిమాలకు సంబంధించిన రివ్యూలు మాత్రమే ఉన్నాయని, తెరవడానికి ప్రయత్నిస్తే కూడా సైట్ ఓపెన్ కాకపోగా, ఏ ఇతర పైరసీ సైట్లకు రీడైరెక్ట్ అవ్వడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే iBOMMA, BAPPAM వంటి వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు చెప్పారు.
News November 20, 2025
పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయా? ఇలా తెలుసుకోండి!

నిన్న ప్రధాని మోదీ పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.18వేల కోట్లు జమ చేశారు. భూమి వివరాలు PM-KISAN పోర్టల్లో నమోదై ఉండి, బ్యాంక్ అకౌంట్ ఆధార్తో లింక్ అయి ఉన్న రైతులకే ఈ స్కీమ్ ప్రయోజనాలు అందనున్నాయి. https://pmkisan.gov.in/లోకి వెళ్లి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో, లేదో తెలుసుకోవచ్చు.


