News January 31, 2025
మేళ్లచెరువు జాతరకు రూ.కోటి మంజూరు

మేళ్లచెరువు జాతరకు నిధులు మంజూరయ్యాయి. శ్రీఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా నిర్వహించే మహాశివరాత్రి జాతరకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసినట్లు ఈఓ కొండారెడ్డి తెలిపారు. మంత్రి ఉత్తమ్ ప్రత్యేక చొరవ తీసుకొని దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News November 2, 2025
భద్రాద్రి: మా రహదారి కష్టాలు తీర్చే నాధుడే లేరా?

చర్ల మండలం తిప్పాపురం నుంచి బత్తిన పెళ్లికి సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తరలించాలంటే డోలీ మోతలే దిక్కని వాపోతున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాయకులు కూడా గ్రామానికి రావడం మానేశారని, ఇప్పటికైనా అధికారులు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.
News November 2, 2025
వరల్డ్ కప్.. వికెట్ పడగొట్టిన శ్రీచరణి

మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన టీం ఇండియా బౌలర్ శ్రీచరణి వికెట్ పడగొట్టింది. సౌతాఫ్రికా 62 పరుగుల వద్ద ఉండగా ఆమె బ్యాటర్ బాష్(Bosch)ను రెండో వికెట్గా పెవిలియన్కు పంపింది.
News November 2, 2025
VJA: జోగి రమేశ్ విచారణ పూర్తి.. కుమారుడికి నోటీసులు జారీ

నకిలీ మద్యం కేసులో మాజీమంత్రి జోగి రమేశ్ సిట్ విచారణ పూర్తి అయ్యింది. 11 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. జనార్దనరావుతో సంబంధాలపై సిట్ అధికారులు ఆయనను ప్రశ్నించారు. కాసేపట్లో ప్రభుత్వాస్పత్రికి జోగి రమేశ్ తరలించారు. జోగి రమేశ్ చిన్న కుమారుడు జోగి రోహిత్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని రోహిత్కు సిట్ నోటీసులు జారీ చేశారు.


