News January 31, 2025
మేళ్లచెరువు జాతరకు రూ.కోటి మంజూరు

మేళ్లచెరువు జాతరకు నిధులు మంజూరయ్యాయి. శ్రీఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల సందర్భంగా నిర్వహించే మహాశివరాత్రి జాతరకు ప్రభుత్వం రూ.కోటి మంజూరు చేసినట్లు ఈఓ కొండారెడ్డి తెలిపారు. మంత్రి ఉత్తమ్ ప్రత్యేక చొరవ తీసుకొని దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News February 18, 2025
ఎలమంచిలిలో జిల్లా హాకీ జట్టు ఎంపిక పోటీలు

ఎలమంచిలి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఈనెల 20వ తేదీన జిల్లా హాకీ జట్టు సీనియర్ పురుషుల టీమ్ను ఎంపిక చేసేందుకు పోటీలు నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి కొఠారి నరేశ్ మంగళవారం తెలిపారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎంపిక పోటీలు జరుగుతాయని అన్నారు. ఎంపికైన వారు వచ్చే నెల గుంటూరులో జరిగే పోటీలో పాల్గొంటారని అన్నారు.
News February 18, 2025
నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నర్సంపేట -పాకాల మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగి యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. అశోక్ నగర్కు చెందిన వెంకటేశ్ నర్సంపేటలో షాపులో పని చేస్తుండేవాడు. సోమవారం రాత్రి పని ముగించుకుని బైక్పై ఇంటికి వెళుతున్న క్రమంలో ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
జి.సిగడాం: పింఛను సొమ్ముతో అధికారి జంప్

జి.సిగడాంలోని పెంట గ్రామ సచివాలయంలో సర్వేయర్ పింఛను సొమ్ముతో పరారైనట్లు సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు వారు సర్వేయర్ భాను ప్రతాప్ రూ. 49 వేలు తీసుకెళ్లాడని సోమవారం తహశీల్దార్ ఎం. శ్రీకాంత్, ఎంపీడీవో రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈనెలకు సంబంధించి రూ. 1.66 లక్షల సొమ్ములో రూ. 1.17 లక్షలు పంపిణీ చేసి మిగిలిన సొమ్ముతో ఉడాయించినట్లు వారు ఆరోపించారు.