News April 29, 2024

మే 1న పెందుర్తిలో పవన్ కళ్యాణ్ సభ

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మే 1న పెందుర్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఆ పార్టీ నాయకులకు సమాచారం అందింది. పెందుర్తి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పంచకర్ల రమేశ్ బాబు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. బహిరంగ సభకు జన సేకరణలో నాయకులు నిమగ్నమయ్యారు. పెందుర్తి జంక్షన్ లో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభ జరగనుంది.

Similar News

News December 4, 2025

జీవీఎంసీలో విలీనం కానున్న గ్రామీణ మండలాలివే..!

image

ఉమ్మడి విశాఖ జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన 4 మండలాలైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తిని GVMCలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 3 గ్రామీణ మండలాలు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం) GVMCలో కలిపేందుకు CM చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. దీంతో GVMC పరిధి విస్తరణతో పాటు వార్డులు కూడా పెరగనున్నాయి.

News December 4, 2025

వాల్తేరు డివిజన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేత

image

గరివిడి-సిగడం-చీపురుపల్లి సెక్షన్‌లో ఆటో సిగ్నలింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజనల్ కార్యాలయం బుధవారం తెలిపింది. ఈనెల 6, 7, 8 తేదీల్లో విశాఖ-పలాస మెము (67289/67290), విశాఖ-బ్రహ్మపురం ప్యాసింజర్ (58531/58532), విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (18525/18526) సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.

News December 4, 2025

వాల్తేరు డివిజన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేత

image

గరివిడి-సిగడం-చీపురుపల్లి సెక్షన్‌లో ఆటో సిగ్నలింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజనల్ కార్యాలయం బుధవారం తెలిపింది. ఈనెల 6, 7, 8 తేదీల్లో విశాఖ-పలాస మెము (67289/67290), విశాఖ-బ్రహ్మపురం ప్యాసింజర్ (58531/58532), విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (18525/18526) సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.