News April 29, 2024

మే 1న పెందుర్తిలో పవన్ కళ్యాణ్ సభ

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మే 1న పెందుర్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఆ పార్టీ నాయకులకు సమాచారం అందింది. పెందుర్తి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పంచకర్ల రమేశ్ బాబు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. బహిరంగ సభకు జన సేకరణలో నాయకులు నిమగ్నమయ్యారు. పెందుర్తి జంక్షన్ లో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభ జరగనుంది.

Similar News

News April 12, 2026

విశాఖ: రేపు ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News April 12, 2026

విశాఖ ప్రజలకు గమనిక.. ఈ నెల 30 వరకే గడువు

image

2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీను ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం పొడిగించిందని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను ఈ నెల 30లోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేటును ఇవ్వనున్నట్లు తెలిపారు.

News April 12, 2026

విశాఖ ప్రజలకు గమనిక.. ఈ నెల 30 వరకే గడువు

image

2026 మార్చి 31 వరకు ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీను ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం పొడిగించిందని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను ఈ నెల 30లోగా చెల్లించిన వారికి 5 శాతం రిబేటును ఇవ్వనున్నట్లు తెలిపారు.