News April 29, 2024
మే 1-5 లోగా పింఛన్ల పంపిణీ పూర్తి: కలెక్టర్

మే 1వ తేదీ నుంచి 5వ తేదీలోగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.విజయ సునీత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, తదితర ఫించనుదారులు 1,26,773 మంది, మెడికల్ ఫించన్లు పొందుతున్న వారు 1,121 మంది కలిపి 1,27,894 మందికి పంపిణీ చేయాల్సి ఉందన్నారు. గత నెలలో 99.18 శాతం ఫించన్లు పంపిణీ చేసి రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచామని, అదే స్ఫూర్తితో ఈనెల కూడా ఫించన్లు పంపిణీ చేయాలన్నారు.
Similar News
News April 14, 2026
విశాఖలోని ఒక్కరోజే 2474 కేసులు

విశాఖలోని ట్రాఫిక్ పోలీసులు సోమవారం ఒక్కరోజే 2,474 కేసులు నమోదు చేశారు. వాటి వివరాలిలా ఉన్నాయి. హెల్మెట్ ధరించనని-1,209, పిలియన్ రైడర్-226, ట్రిపుల్ రైడింగ్- 112, ఓవర్ స్పీడ్-223, సెల్ఫోన్ డ్రైవింగ్-19, డ్రైవింగ్ లైసెన్స్ లేనివి-06, మైనర్ డ్రైవింగ్ 02, రాంగ్ పార్కింగ్-191, డ్రంకన్ డ్రైవింగ్-47, సీజ్ అయిన వెహికల్స్-58 ఎంవీ యాక్ట్ ఉల్లంఘన-501 కేసులు ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు.
News April 13, 2026
విశాఖ: స్కూటీని ఢీకొన్న బస్సు.. మహిళ మృతి

విశాఖలోని రామా టాకీస్ వద్ద స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వెనుక ఉన్న మహిళ బస్సు చక్రల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. హైదరాబాద్కు చెందిన రోజా రాణి తన అన్నకు ఆపరేషన్ జరిగిందని తెలుసుకొని విశాఖ వచ్చి పరామర్శించి తమ్ముడితో స్కూటీపై వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందినట్లు సమాచారం. త్రీ టౌన్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 13, 2026
విశాఖ: టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై మీ కామెంట్..!

GVMC పరిధిలో టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ప్రతి సోమవారం PGRSలో అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. 2 నెలల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు, నాయకులు వేధింపులు తాళలేక కంచరపాలెంలో ఒక వ్యక్తి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇటీవల టౌన్ ప్లానింగ్ శాఖపై ACB దాడులు కలకలం సృష్టించాయి. గత కలెక్టర్ కూడా ఈ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ విశాఖ ప్రజలు టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై మీ కామెంట్ తెలపండి.


