News April 28, 2024

మే 1-5 వరకు ఖాతాల్లో పెన్షన్ జమ: కలెక్టర్ హిమాన్షు

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మే 1 నుంచి 5వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ చేపడతామని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం వెల్లడించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో పెన్షన్ సొమ్ము జమ చేస్తామన్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికి పరిమితమైన వారు, సైనిక, సంక్షేమ పింఛన్లు పొందే వారికి ఇంటి వద్దనే సెక్రటేరియట్ సిబ్బంది పెన్షన్లు అందజేస్తారన్నారు.

Similar News

News April 18, 2026

నిడదవోలులో ఈనెల 18న సీఎం పర్యటన

image

సీఎం చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలను సందర్శించి భద్రతా పరమైన సూచనలు చేశారు. సీఎం రాకపోకల సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలన్నారు.

News April 18, 2026

నిడదవోలులో ఈనెల 18న సీఎం పర్యటన

image

సీఎం చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాలను సందర్శించి భద్రతా పరమైన సూచనలు చేశారు. సీఎం రాకపోకల సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలన్నారు.

News April 17, 2026

సెన్సస్–2027: స్వీయ నమోదును వినియోగించుకోండి: కలెక్టర్

image

జనగణన (సెన్సస్–2027)లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని జిల్లా ప్రజలందరూ స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రజలు తమ కుటుంబ వివరాలను [https://se.census.gov.in](https://se.census.gov.in) పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.