News April 29, 2024
మే 13న సెలవు: కలెక్టర్

పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు పోలింగ్ జరిగే మే 13న జిల్లాలో స్థానిక సెలవుదినంగా ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ప్రైవేటు సంస్థల్లో పనిచేసే కార్మికులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం, 1881 ప్రకారం సెలవు ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
VZM: ఈ నెల 14తో తీరనున్న గడువు

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో వీసీ నిర్వహించారు. ఇళ్ల స్థలాల కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 14 వరకు గడువు ఇచ్చిందని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి తప్పనిసరిగా నమోదు చేయించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఇళ్ల స్థలాల కోసం వివరాలు, అవసరమైన భూమి వంటి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.
News December 3, 2025
ఎర్త్ సమ్మిట్ గ్రామీణాభివృద్ధికి ఉపయోగకరం: డీసీసీబీ ఛైర్మన్

గ్రామాలును అభివృద్ధి చేయటానికి ఎర్త్ సమ్మిట్ దోహదపడుతుందని విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం తెలిపారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత, ఆర్థిక నూతన పరిష్కారాలపై దృష్టి సారిస్తూ, NABARD, (IAMAI)లతో కలిసి డిసెంబర్ 5,6 తేదీల్లో గుజరాత్ గాంధీనగర్లో నిర్వహిస్తున్న ఎర్త్ సమ్మిట్ 2025 జరుగుతుందన్నారు. బ్యాంక్ రైతులకు, మహిళా సంఘాలకు సేవలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
News December 3, 2025
VZM: ‘64 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు’

విజయనగరం పట్టణంలో జరిగిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 66 మంది వాహనదారులు పట్టుబడ్డారు. కోర్టు విచారణలో 64 మందికి రూ.10,000 చొప్పున జరిమానా.. ఇద్దరికి వరుసగా 2 రోజులు, 5 రోజుల జైలు శిక్ష విధించామని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు మద్యం తాగి వాహనం నడపకూడదని, భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.


