News January 28, 2025

మే 15 నుంచి 26 వరకు సరస్వతి నదీ పుష్కరాలు: మంత్రి సురేఖ

image

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతి నది పుష్కరాలకు ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ ద్వారా రూ.25 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. సరస్వతీ నదీ పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు, స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం పనులను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.

Similar News

News November 28, 2025

నంద్యాల: ‘సమగ్ర ఓటర్ల జాబితా రూపకల్పనకు చర్యలు’

image

జిల్లాలో స్పష్టమైన, సక్రమమైన ఓటర్ల జాబితా రూపొందించడానికి సమగ్ర చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కు వివరించారు. విజయవాడలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌తో పాటు డీఆర్ఓ రాము నాయక్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

News November 28, 2025

నంద్యాల: ‘సమగ్ర ఓటర్ల జాబితా రూపకల్పనకు చర్యలు’

image

జిల్లాలో స్పష్టమైన, సక్రమమైన ఓటర్ల జాబితా రూపొందించడానికి సమగ్ర చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌కు వివరించారు. విజయవాడలోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ నుంచి జిల్లా కలెక్టర్‌తో పాటు డీఆర్ఓ రాము నాయక్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

News November 28, 2025

శ్రీకాకుళం: వర్షాలపై అప్రమత్తం.. ధాన్యం సేకరణపై దృష్టి

image

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కలెక్టర్లు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.