News January 28, 2025

మే 15 నుంచి 26 వరకు సరస్వతి నదీ పుష్కరాలు: మంత్రి సురేఖ

image

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతి నది పుష్కరాలకు ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ ద్వారా రూ.25 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. సరస్వతీ నదీ పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు, స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం పనులను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.

Similar News

News November 10, 2025

HYD: రేపు ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

image

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అంత్యక్రియలను రేపు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులకు CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేసి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, HYD, RR, MDCL కలెక్టర్లకు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలిచ్చారు. ఘట్‌కేసర్‌లో జరగనున్న అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

News November 10, 2025

HYD: రేపు ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

image

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అంత్యక్రియలను రేపు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులకు CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేసి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, HYD, RR, MDCL కలెక్టర్లకు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలిచ్చారు. ఘట్‌కేసర్‌లో జరగనున్న అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

News November 10, 2025

రహదారి పక్కన ఇంటి నిర్మాణానికి నియమాలు

image

రహదారి పక్కనే ఇల్లు కట్టుకుంటే, ఆ దారి కొలతకు ఇంటి పొడవు రెండింతల కంటే ఎక్కువ ఉండకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తారు. ఈ నియమం ఇంటికి, బయటి శక్తి ప్రవాహానికి మధ్య సమతుల్యతను నెలకొల్పుతుందని అంటారు. ‘ఇంటి పొడవు అధికంగా ఉంటే.. అది రోడ్డు నుంచి వచ్చే చంచల శక్తిని ఎక్కువగా ఆకర్షించి, ఇంట్లో స్థిరత్వాన్ని తగ్గిస్తుంది. గృహంలో ప్రశాంతత ఉండాలంటే ఈ నియమం పాటించాలి’ అని తెలుపుతున్నారు. <<-se>>#Vasthu<<>>