News January 28, 2025

మే 15 నుంచి 26 వరకు సరస్వతి నదీ పుష్కరాలు: మంత్రి సురేఖ

image

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతి నది పుష్కరాలకు ఏర్పాట్ల కోసం దేవాదాయ శాఖ ద్వారా రూ.25 కోట్లను మంజూరు చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. సరస్వతీ నదీ పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు, స్నాన ఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం పనులను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు.

Similar News

News December 3, 2025

వేములవాడ: రాజన్న ఆలయాభివృద్ధి.. ‘ఆఫీసర్లపై ఆంక్షలు’

image

వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, ముఖ్యంగా ఇంజినీరింగ్ పనులకు సంబంధించి ఆయా అధికారులు అస్సలు నోరు విప్పడం లేదట. డెవలెప్‌మెంట్ పనులు, పురోగతికి సంబంధించి ఎటువంటి సమాచారం మీడియాకు లీక్ చేయొద్దనే ఆంక్షలను ఆఫీసర్లపై విధించారట. దీంతో ఆలయాభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారమేదీ పక్కాగా బయటకు రావడంలేదు. కాగా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఏ చిన్న విషయమైన తెలుసుకోవాలని ప్రతి భక్తుడికి సాధారణంగా ఉంటుంది.

News December 3, 2025

అంబేడ్కర్ భవన్‌లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

image

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హనుమకొండ అంబేడ్కర్ భవన్‌లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దివ్యాంగుల విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఉపకార వేతనాలు, సబ్సిడీ రుణాలు వంటి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ సందర్భంగా వారి హక్కులు, అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు.

News December 3, 2025

అమరావతికి రాజధాని హోదా.. కేంద్రం సవరణ బిల్లు

image

AP: అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రం సవరణ బిల్లును తీసుకొస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో సవరణ ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి న్యాయశాఖ ఆమోదం లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తే అమరావతి రాజధాని హోదాకు చట్టబద్ధత ఏర్పడుతుంది.