News April 25, 2024

మే 4న నారాయణపేటకు ప్రధాని మోదీ

image

నారాయణపేట: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 30, మే 3, 4 తేదీల్లో ఆయన పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మే 4న నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నాగర్ కర్నూల్ రాగా, 2వ సారి నారాయణపేటకు రానున్నారు.

Similar News

News December 2, 2025

పాలమూరు: ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలి

image

సర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఓటర్లు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు తమ పోలీస్ అధికారులకు సహకరించాలని ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి సమస్యలు వచ్చిన తమ పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News December 2, 2025

రేపటి నుంచి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

image

దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఈవో శ్యాంసుందర్ సోమవారం తెలిపారు. దాదాపు 5 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎక్కడ భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేలా తగు చర్యలు తీసుకున్నామన్నారు. డిసెంబర్ 6వ తేదీన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు.

News December 1, 2025

MBNR: మహిళలను వేధిస్తే 8712659365 కాల్ చేయండి

image

పనిచేసే ప్రదేశంలో, విద్యార్థులు చదువుకునే ప్రాంతాలలో ఎవరైనా మహిళలను వేధిస్తే వెంటనే 8712659365 నంబర్‌కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ఎల్లప్పుడూ మహిళల రక్షణ కోసం తమ షీ టీం బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతామని సూచించారు. విద్యార్థినీలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.