News April 25, 2024

మే 4న నారాయణపేటకు ప్రధాని మోదీ

image

నారాయణపేట: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 30, మే 3, 4 తేదీల్లో ఆయన పర్యటించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. మే 4న నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే నాగర్ కర్నూల్ రాగా, 2వ సారి నారాయణపేటకు రానున్నారు.

Similar News

News October 21, 2025

పాలమూరు వర్శిటీ.. దేశవ్యాప్తంగా వినిపించాలి:VC

image

పాలమూరు వర్శిటీ పేరు దేశవ్యాప్తంగా వినిపించేలా పథకాలు సాధించాలని వర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆర్చరీ పురుషుల జట్టుకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. సౌత్ జోన్(ఆల్ ఇండియా ఇంటర్ వర్శిటీ) టోర్నమెంట్లో పాల్గొనేందుకు ఆర్చరీ జట్టు గురుకాసి వర్శిటీ పంజాబ్‌కు బయలుదేరారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు, అసోసియేట్ ప్రొ.డాక్టర్ ఎన్.కిషోర్,PD శ్రీనివాసులు పాల్గొన్నారు.

News October 21, 2025

నవాబుపేట: క్షతగాత్రుడి వివరాలు తెలిస్తే చెప్పండి

image

నవాబుపేట మండలంలోని ఫతేపూర్ మైసమ్మ దేవాలయ సమీపంలో రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళుతూ.. ఓ వ్యక్తి కిందపడ్డాడు. ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయాల పాలైన ఆ వ్యక్తి ఆచూకీ తెలిస్తే.. 8712659340 సమాచారం ఇవ్వాలని ఎస్సై విక్రం మంగళవారం తెలిపారు.

News October 21, 2025

కురుమూర్తి రాయుడికి పట్టు వస్త్రాల తయారీ

image

కురుమూర్తి వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సమర్పించేందుకు పట్టు వస్త్రాలు సిద్ధమవుతున్నాయి. ఉత్సవాల్లో రెండో ఘట్టమైన అలంకరణ ఉత్సవం రోజున ఈ వస్త్రాలు స్వామివారికి సమర్పించనున్నారు. ఆనవాయితీగా అమరచింత చేనేత కళాకారులు పట్టు వస్త్రాలను సమర్పించడం 66 ఏళ్లుగా కొనసాగుతోంది. అప్పట్లో గ్రామానికి చెందిన కొంగరి చెన్నయ్య అనే వ్యక్తి స్వామికి పట్టు వస్త్రాల మొక్కుబడి ఇప్పటికి ఉంటడం విశేషం.