News May 12, 2024

మైదుకూరులో శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి విగ్రహం గుర్తింపు

image

మైదుకూరు మండలం వనిపెంట శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో బాలకృష్ణుని విగ్రహం గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు బొమ్మిశెట్టి రమేశ్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఈ ఆలయంలోని మొగసాల మండపంను ముద్దరాజు కట్టించారు. ఈ మండపం రాతి కట్టడంపై బాలకృష్ణుని ప్రతిమను నిర్మించారని తెలిపారు. 

Similar News

News March 17, 2026

ఎంపీ అవినాష్ వ్యాఖ్యలపై భూపేశ్ రెడ్డి కౌంటర్

image

వివేక్ కుమార్తె సునీతను అడ్డం పెట్టుకొని టీడీపీ లబ్ధి పొందాలని చూస్తుందని ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని మీ మాయ మాటలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. 11 సీట్లు వచ్చినా బుద్ధి మారలేదని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. వివేకాను హత్య చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు.

News March 17, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,600
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,352
* వెండి 10 గ్రాముల ధర రూ.2,610.

News March 17, 2026

సిద్దవటం: భర్త హత్య కేసులో భార్యకు జీవిత ఖైదు

image

సిద్దవటం మండలంలోని కపర్దేశ్వర స్వామి కోన వద్ద 2014లో జరిగిన హత్య కేసులో నలుగురు ముద్దాయిలకు కోర్టు జీవిత ఖైదు విధించింది. భర్తను హత్య చేసి బంగారు నగలు దోచుకున్న కేసులో భార్యతో పాటు మరో ముగ్గురిపై నేరం రుజువవడంతో కడప కోర్టు ఒక్కొక్కరికి జీవిత ఖైదు, రూ.2000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది.