News April 10, 2025

మైనర్ బాలికతో అసభ్యకర ప్రవర్తన.. రెండేళ్ల జైలు శిక్ష

image

మైనర్ బాలిక స్నానాల గదిలో ఉండగా ఆమెను దొంగచాటుగా చూస్తున్న గాంచిరీ శివకుమార్ అనే వ్యక్తిని బాలిక ప్రశ్నించగా ఆమెను చంపుతానని బెదిరించిన ఘటనలో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి బుధవారం సాయంత్రం తీర్పునిచ్చారు. ఈ ఘటన 2020 సంవత్సరంలో ఏలూరులోని తూర్పు వీధిలో జరిగింది. బాలికకు రూ.50 వేలు నష్టపరిహారాన్ని చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Similar News

News July 9, 2025

దేవీపట్నంలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

image

దేవీపట్నం మండలం పెద్దవుర గ్రామానికి చెందిన మిర్తివాడ రమణారెడ్డి బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందాడని అతని సోదరి వీరవేణి తెలిపారు. యానాం సమీపంలో కోనవానిపాలెం గ్రామంలో రొయ్యల చెరువు వద్ద వారం రోజుల కిందట కూలి పనికి వెళ్లి చెరువులో పడి మృతి చెందాడన్నారు. యజమాని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సోదరుడి మృతిపై అనుమానం ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

News July 9, 2025

HYD: 2023 ప్రతిభ పురస్కారాలు.. ఎంపికైంది వీరే

image

ఎలనాగ(కవిత), ప్రభల జానకి(విమర్శ), ఆర్.లక్ష్మీరెడ్డి(చిత్రలేఖనం), సంపత్ రెడ్డి(శిల్పం), రమేశ్ లాల్(నృత్యం), హరిప్రియ(సంగీతం), ప్రతాపరెడ్డి(పత్రికా రంగం), గుమ్మడి గోపాలకృష్ణ(నాటకం), పాపయ్య(జానపద కళ), ధూళిపాళ మహాదేవమణి (అవధానం), మలయవాసిని(ఉత్తమ రచయిత్రి), శాంతి నారాయణ(నవల/కథ) పురస్కారాలకు ఎంపికయ్యారని తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ హనుమంతరావు తెలిపారు. వీరికి 19న పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

News July 9, 2025

వీరవల్లి: మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

image

మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. పొట్టిపాడుకు చెందిన జస్వంత్ ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.