News August 14, 2024
మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం 15% నిధులు : కలెక్టర్

ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం అమలులో మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం 15% నిధులు తప్పనిసరిగా వినియోగించాలని కలెక్టర్ ఆనంద్ అన్నారు. ప్రధానమంత్రి 15 సంవత్సరాల అమలు కార్యక్రమంపై త్రైమాసిక సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శంకరన్ హాల్లో మంగళవారం జరిగింది. ఈ పథకం అమలు చేస్తున్న 25 శాఖలలో అధికారులు లక్ష్యాలను నిర్ధారించుకుని ప్రతి పథకంలో 15% మైనారిటీల అభివృద్ధి, సంక్షేమాన్ని కేటాయించారు.
Similar News
News December 6, 2025
పెంచలకోనలో విశేష పూజలు

రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
News December 6, 2025
Way2News ఎఫెక్ట్.. స్పందించిన బుచ్చి ఛైర్ పర్సన్

బుచ్చి మున్సిపాలిటీ మలిదేవి బ్రిడ్జి వద్ద గోతులు ఏర్పడి రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో <<18484228>>’500 మీటర్లలో.. లెక్కలేనన్ని గుంతలు’ <<>>అనే శీర్షికన Way2Newsలో కథనం ప్రచురితమైంది. స్పందించిన బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి మలిదేవి బ్రిడ్జి వద్ద రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులను శనివారం చేపట్టారు. వాహనదారులు ప్రయాణికులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
News December 6, 2025
నెల్లూరు: 500 మీటర్లలో.. లెక్కలేనన్ని గోతులు

బుచ్చి మున్సిపాలిటీ నడిబొడ్డులో మలిదేవి బ్రిడ్జి వద్ద రోడ్డుపై లెక్కలేనన్ని గోతులు ఏర్పడి రోడ్డు అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు ఉండడంతో రోడ్డుపై వెళ్లాలంటే కుదుపులకు వాహనాలతోపాటు,ఒళ్లు గుల్లవుతుందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్నా ప్రధాన రహదారుల రూపు మారలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.


