News August 14, 2024

మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం 15% నిధులు : కలెక్టర్

image

ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం అమలులో మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం 15% నిధులు తప్పనిసరిగా వినియోగించాలని కలెక్టర్ ఆనంద్ అన్నారు. ప్రధానమంత్రి 15 సంవత్సరాల అమలు కార్యక్రమంపై త్రైమాసిక సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శంకరన్ హాల్లో మంగళవారం జరిగింది. ఈ పథకం అమలు చేస్తున్న 25 శాఖలలో అధికారులు లక్ష్యాలను నిర్ధారించుకుని ప్రతి పథకంలో 15% మైనారిటీల అభివృద్ధి, సంక్షేమాన్ని కేటాయించారు.

Similar News

News November 3, 2025

నెల్లూరు: 1,282.63 హెక్టార్లలో పంటకు నష్టం

image

తుపాన్ కారణంగా జిల్లాలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 33 శాతం కంటే ఎక్కువగా నష్టం జరిగిన పంట వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 79,333 హెక్టార్లలో వరి సాగు చెయ్యగా 1282.63 హెక్టార్లలో పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వేరుసెనగ 11.4 హెక్టార్లు, మొక్క జొన్న 21.7 హెక్టార్లు, సజ్జ పంటకు 5 హెక్టార్లలో నష్టం వాటిల్లింది.

News November 3, 2025

YCP నేతపై అర్ధరాత్రి కత్తులతో దాడి

image

వెంకటాచలం మండల YCP నేత, రాష్ట్ర ST సెల్ జాయింట్ సెక్రెటరీ బదనాపురి గోపాల్‌పై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం దాడి చేసినట్లు కుటుంబీకులు తెలిపారు. అర్ధరాత్రి గోపాల్ ఇంట్లో ఉండగా కత్తులతో దాడికి తెగబడ్డారన్నారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. ఓ పార్టీ నేతలు తమ కుమారుడిపై దాడి చేశారని గోపాల్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రికిలో చికిత్స కొనసాగుతోంది.

News November 3, 2025

తుప్పు పడుతున్న సబ్ మిషన్ ప్రాజెక్ట పరికరాలు

image

ఉదయగిరి మండలంలోని గండిపాలెం జలాశయ సమీపంలో సుమారు ఏడు కోట్ల రూపాయలతో నిర్మించిన రాజీవ్ టెక్నాలజీ సబ్మిషన్ ప్రాజెక్ట్ మంచినీటి పథక యంత్ర పరికరాలు తుప్పుపడుతున్నాయి. దీంతో ఫ్లోరిన్ రహిత తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం ప్రజలు వాటర్ ప్లాంట్లపై ఆధారపడి తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్వందించాలని కోరుతున్నారు.