News March 24, 2024
మైనార్టీల ఇలాకా ‘హైదరాబాద్’ పార్లమెంట్

HYD ఎంపీ పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, మలక్పేట, కార్వాన్ శాసనసభ నియోజకవర్గాల్లో అధికంగా మైనార్టీ ఓటర్లు ఉంటారు. దీనికి తగ్గట్టే 1984 నుంచి ఎంఐఎం నేత సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ గెలవగా ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఇతర పార్టీల అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోతున్నారు. ఈసారి కూడా అసదుద్దీన్ గెలుస్తారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి.
Similar News
News October 29, 2025
HYDలో భారీ వర్షం.. ఈ మెసేజ్ వచ్చిందా?

HYD, RR, MDCL జిల్లాలో వర్ష తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని Telangana Integrated Command and Control Centre (TGiCCC) తెలిపింది. గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఫోన్లకు హెచ్చరిక మెసేజ్లు పంపింది. మీకూ వచ్చాయా?
News October 29, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఏర్పాట్లలో భాగంగా బుధవారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. జనరల్ అబ్జర్వర్ రంజిత్ కుమార్ అధ్యక్షతన పరిశీలన జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఈసీఐ మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా ప్రక్రియ కొనసాగింది.
News October 29, 2025
జూబ్లిహిల్స్ బై పోల్స్.. ఎన్నికల నిర్వహణలో ఇవీ గణాంకాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నోటాతో కలిపి 59 మంది అభ్యర్థుల పేర్లను 407 పోలింగ్ బూత్లలో బ్యాలెట్ యూనిట్లలో (ప్రతి పోలింగ్ బూత్లో నాలుగు) అమర్చుతారు. 20 శాతం అదనంగా కలిపి 1954 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తారు. ఇక 509 కంట్రోల్ యూనిట్లు, 509 వీవీ ప్యాట్లు వాడనున్నారు. ఇవన్నీ ఇపుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన డీఆర్సీలో ఉన్నాయి.


