News March 24, 2024
మైనార్టీల ఇలాకా ‘హైదరాబాద్’ పార్లమెంట్

HYD ఎంపీ పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, మలక్పేట, కార్వాన్ శాసనసభ నియోజకవర్గాల్లో అధికంగా మైనార్టీ ఓటర్లు ఉంటారు. దీనికి తగ్గట్టే 1984 నుంచి ఎంఐఎం నేత సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ గెలవగా ఆ తర్వాత అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధిస్తూ వస్తున్నారు. దీంతో ఇతర పార్టీల అభ్యర్థులు నామమాత్రంగానే మిగిలిపోతున్నారు. ఈసారి కూడా అసదుద్దీన్ గెలుస్తారని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి.
Similar News
News November 14, 2025
16 ఏళ్ల తర్వాత జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా

జూబ్లీహిల్స్ గడ్డపై 16 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గెలుపు జెండా ఎగరేసింది. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడిన ఏడాదే ఎన్నికలు జరగగా కాంగ్రెస్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత 2014లో TDP, 2018లో TRS, 2023లో BRS గెలిచాయి. ఈ ఉపఎన్నికలో గత రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ జెండాను నియోజకవర్గంలో ఎగరేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
News November 14, 2025
చరిత్ర గుర్తుపెట్టుకునే గెలుపు ఇది: మంత్రి సీతక్క

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన ఓటర్లకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కోసం కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పారు. ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను అభినందించారు. ‘ఇది చారిత్రాత్మక విజయం. చరిత్ర గుర్తుపెట్టుకునే గెలుపు ఇది. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని, అనంతమైన అబద్దాలకు ప్రజలు చెప్పిన గుణపాఠం ఇది’ అని అన్నారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్: 2018 నుంచి BRS VS కాంగ్రెస్

జూబ్లీహిల్స్లో ఎన్నికలను పరిశీలిస్తే 2018 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్, BRS మధ్యే పోటీ నడుస్తోంది. 2018లో TRS అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గెలవగా INC అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. 2023లో BRS అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మళ్లీ గెలవగా INC అభ్యర్థి అజహరుద్దీన్ రెండో స్థానంలో నిలిచారు. ఈ ఉపఎన్నికలో INC అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవగా BRS అభ్యర్థి మాగంటి సునీత సెకండ్ ప్లేస్లో నిలిచారు.


