News July 26, 2024
మైనార్టీ విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తాం: డిప్యూటీ సీఎం

2024-25లో మైనార్టీ విద్యార్థులకు UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రభుత్వం ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా లోకల్ అభ్యర్థులకు నెలకు రూ.2500, నాన్ లోకల్ అభ్యర్థులకు రూ.5,000 చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. అటు ఈ ఏడాది రంజాన్ పండుగ వేడుకలకు రూ.33కోట్లు రిలీజ్ చేశామన్నారు.
Similar News
News December 22, 2025
ఖమ్మంలో ‘శిల్పారామం’

ఖమ్మంలో శిల్పారామం ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. ఖానాపురం హవేలీ పరిధిలోని సర్వే నం. 94, 234లో 5.04 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు అధికారులు పరిశీలన పూర్తి చేశారు. శిల్పారామం ముఖద్వారానికి సంబంధించిన నమూనాను తక్షణమే సిద్ధం చేసి, పనులను పట్టాలెక్కించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరం పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా రూపుదిద్దుకోనుంది.
News December 21, 2025
రేపు వరదలు, ప్రమాదాలపై మాక్ డ్రిల్

వరదలు, పరిశ్రమల ప్రమాదాలు జరిగినప్పుడు ఎదుర్కోవాల్సిన తీరుపై అవగాహన కల్పించేందుకు సోమవారం ఖమ్మం నయాబజార్లోని ZPSS, జనరల్ ఆస్పత్రిలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మాక్ డ్రిల్ జరగనున్నందున ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఇందులో 50 మంది చొప్పున ఆపద మిత్ర వలంటీర్లు, 20 మంది NCC కేడెట్లు పాల్గొంటారని తెలిపారు.
News December 21, 2025
అడవి మంటలపై అప్రమత్తంగా ఉండాలి: అటవీ శాఖ

ఖమ్మం జిల్లాలో అడవి మంటల నివారణకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని అటవీ శాఖ కోరింది. అటవీ ప్రాంతాల్లో సిగరెట్లు తాగడం, వంటల కోసం నిప్పు రాజేయడం వంటి పనులు చేయరాదని హెచ్చరించింది. “అడవిని రక్షిస్తేనే – భవిష్యత్తు ఉంటుంది” అని పేర్కొంటూ, ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు కనిపిస్తే వెంటనే 87422 95323 లేదా టోల్ ఫ్రీ 18001 19334 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరింది.


