News February 15, 2025

మైలవరం: యూట్యూబ్ చూసి తండ్రిని చంపిన కుమారుడు

image

మైలవరం (మ) మెర్సుమల్లి శివారు ములకపెంటలో ఇటీవల కన్నతండ్రిని కుమారుడు చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. నిందితుడు పుల్లారావు డబ్బును షేర్ మార్కెట్‌లో పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రి శ్రీనివాసరావును ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వమని అడిగాడు. తండ్రి ఒప్పుకోలేదని కోపంలో కర్రతో కొట్టి చంపాడు. యూట్యూబ్‌లో పలు నేర కథనాలు చూసి కర్రతో కొట్టి చంపినట్లు విచారణలో తెలిందని సీఐ చంద్రశేఖర్ చెప్పారు.

Similar News

News November 21, 2025

వరంగల్: ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే కఠిన చర్యలు

image

విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, వైద్యులు, రెవెన్యూ, పోలీస్ అధికారులను బెదిరించడం, దాడి చేయడం వంటి చర్యలపై వరంగల్ పోలీసు శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ప్రజా సేవల్లో ఉన్న అధికారుల పనిలో జోక్యం చేసుకున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని వరంగల్ పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా స్పష్టం చేశారు.

News November 21, 2025

ఫార్ములా ఈ కేసులో చట్టపరంగానే చర్యలు: మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండ: ఫార్ములా ఈ కారు రేస్ కేసులో చట్టపరంగానే చర్యలు ఉంటాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి ఇవ్వడంపై ఆయన నల్గొండలో స్పందించారు. తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేశారు.

News November 21, 2025

NZB: గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణం: TPCC చీఫ్

image

గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కప్-2025లో NZBకు చెందిన నికత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని TPCC చీఫ్, MLC మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ క్రీడా గౌరవాన్ని మరోసారి ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకంగా నిలబెట్టారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి దేశ, రాష్ట్ర ప్రతిష్టను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.