News February 15, 2025
మైలవరం: యూట్యూబ్ చూసి తండ్రిని చంపిన కుమారుడు

మైలవరం (మ) మెర్సుమల్లి శివారు ములకపెంటలో ఇటీవల కన్నతండ్రిని కుమారుడు చంపిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. నిందితుడు పుల్లారావు డబ్బును షేర్ మార్కెట్లో పెట్టి పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రి శ్రీనివాసరావును ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వమని అడిగాడు. తండ్రి ఒప్పుకోలేదని కోపంలో కర్రతో కొట్టి చంపాడు. యూట్యూబ్లో పలు నేర కథనాలు చూసి కర్రతో కొట్టి చంపినట్లు విచారణలో తెలిందని సీఐ చంద్రశేఖర్ చెప్పారు.
Similar News
News December 4, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలి: కలెక్టర్

షెడ్యూల్ ప్రకారం అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రబీ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన యూరియా, పొటాష్ తదితర రసాయన ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అదనపు నిల్వలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News December 4, 2025
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: తిరుపతి కలెక్టర్

APSSDC ఆధ్వర్యంలో 6వ తేదీ గూడూరు పట్టణంలోని DRW డిగ్రీ కళాశాల జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 15 కంపెనీల ప్రతినిధులు వస్తారని, 700 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 4, 2025
VZM: జిల్లా వ్యాప్తంగా రేపు మెగా పేరెంట్-టీచర్ మీట్

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం మెగా పేరెంట్-టీచర్ మీట్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, నైపుణ్యాలు, పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తల్లిదండ్రులతో చర్చించనున్నట్లు చెప్పారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు పాఠశాలల్లో పాల్గొననున్నారని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొని పిల్లల భవిష్యత్తు నిర్మాణంలో భాగస్వాములవ్వాలన్నారు.


