News February 6, 2025
మైలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మైలవరం దర్గా దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. తిరువూరు విజయవాడ నుంచి తిరువూరు వైపుకు వెళ్తున్న ఆటో కారు ఢీకొన్నాయి. ఆటోలో ఉన్న వ్యక్తి మృతి చెందగా ఆటో డ్రైవర్, బాలుడు, ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు విజయవాడలో పెన్షన్ వెరిఫికేషన్కి వెళ్లి వస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 22, 2025
సౌత్ ఆఫ్రికా సిరీస్లో హార్దిక్ పాండ్య!

ఆసియా కప్ సమయంలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో గాయంతో హార్దిక్ పాండ్య టీమ్కు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్కు కూడా అతను విశ్రాంతిలోనే ఉన్నారు. అయితే హార్దిక్ కోలుకున్నారని, సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సిరీస్కి అందుబాటులో ఉంటారని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. SA జట్టు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల కోసం భారత్లో పర్యటించనుంది.
News October 22, 2025
పెద్దపల్లిలో ‘లింగ నిర్ధారణ’ చట్ట వ్యతిరేకం: డీఎంహెచ్ఓ వాణీ శ్రీ

పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో బుధవారం పీసీపీఎన్డీటీ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ వాణీ శ్రీ మాట్లాడుతూ.. జిల్లాలో 32 స్కానింగ్ సెంటర్లు రిజిస్టర్ అయ్యాయని, వాటిలో ప్రతి నెలా 10 సెంటర్లను తనిఖీ చేస్తూ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్ట విరుద్ధమని, నేరమని ఆమె స్పష్టం చేశారు.
News October 22, 2025
ఆలయాల్లో ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలి: ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర

VJA: కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఇతర ఆలయ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివస్తారని, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్నాన ఘాట్లు, రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయం, మహిళలు ఇబ్బందులు పడకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు.