News March 27, 2025

మొగల్తూరుపై పవన్ ఫోకస్.. కారణం ఇదే!

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి స్వగ్రామం మొగల్తూరు. తండ్రిది పెనుగొండ. దీంతో ఈ రెండు గ్రామాలపై డిప్యూటీ సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ రెండు చోట్ల సమస్యలు తెలుసుకోవడానికి శుక్రవారం ప్రత్యేక మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఏకంగా పవన్ పేషీకి సంబంధించిన అధికారులు ఈ రెండు గ్రామాలకు వస్తారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను గుర్తించి పవన్‌కు వివరించనున్నారు. ఆ తర్వాత అభివృద్ధి పనులు చేపడతారు.

Similar News

News December 4, 2025

జలజీవన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ నాగరాణి

image

జిల్లాలో జలజీవన్ మిషన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖలు సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరా ప్రాజెక్టు ఏర్పాటు పనులపై సంబంధిత శాఖలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులను, పురోగతిని గుత్తేదారు సంస్థ ప్రతినిధి, మేఘా కంపెనీ డీజీఎం వాసు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు.

News December 4, 2025

ప.గో: 594 కిలోల గంజాయి ధ్వంసం

image

పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ స్టేషన్లలో పట్టుబడ్డ గంజాయిని ధ్వంసం చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గుంటూరు జిల్లా కొండవీడు పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ వద్ద ఈ ప్రక్రియ నిర్వహించామన్నారు. మొత్తం 21 కేసులకు సంబంధించిన 594.844 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్టు ఎస్పీ వెల్లడించారు. ఈ ప్రక్రియకు సహకరించిన సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

News December 4, 2025

ప.గోలో డీడీ‌ఓ కార్యాలయాన్ని వర్చువల్‌గా ప్రారంభించినున్న పవన్

image

ప.గో. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన డిటిఓ కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా నుంచి వర్చువల్‌గా గురువారం ప్రారంభిస్తారని గ్రామ వార్డు సచివాలయ అభివృద్ధి అధికారి దోసిరెడ్డి తెలిపారు. డి ఎల్‌డీ‌ఓలను, డీడీవోలుగా కూటమి ప్రభుత్వం సంస్కరణలు చేపట్టిందన్నారు. ఇందులో జిల్లాలోని విస్సాకోడేరు, నరసాపురం, తాడేపల్లిగూడెం డి డి ఓ కార్యాలయాలు ప్రారంభిస్తారు అన్నారు.