News January 22, 2025

మొగల్తూరు: ఎండు చేపలకు భలే గిరాకీ

image

మొగల్తూరు తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు వేటను ముమ్మరంగా చేస్తున్నారు. పచ్చి సరకు కంటే ఎండు చేపలకు గిరాకీ ఉంటోంది. దీంతో వాటిని ఎండబెడుతూ మరింత ఆదాయం పొందుతున్నారు. బయట మార్కెట్లో ఎండు చేపలు సప్లై తక్కువగా ఉండడంతో మొగల్తూరులో ఎండు చేపలకు గిరాకీ పెరిగింది. కేజీ సుమారు రూ.500 పైనే పలుకుతోంది. మరోవైపు చేపలు, రొయ్యల మేతల్లో వీటిని కలిపేందుకు ఎగుమతులు సైతం భారీగా చేస్తున్నారు.

Similar News

News February 5, 2025

భీమవరం: ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..కలెక్టర్

image

గుర్రపు డెక్క నుంచి నారను తీసి బహుళ ప్రయోజనాలకు వినియోగించేలా గ్రామీణ్ ఫౌండేషన్ ప్రతిపాదనలను సిద్ధం చేసి అందజేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. మంగళవారం భీమవరం జిల్లా కలెక్టర్ కలెక్టర్‌లో ఫౌండేషన్ ప్రతినిధులు సమావేశమై గుర్రపు డెక్క ద్వారా వర్మీ కంపోస్ట్ తయారు చేసే ప్రాజెక్టుపై చర్చించారు. గుర్రపు డెక్కన్ డెక్కన్ వేట రూ .5 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు.

News February 5, 2025

ప.గో: నులిపురుగుల నిర్మూలన గోడపత్రిక ఆవిష్కరణ 

image

ఈనెల 10న నిర్వహించే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం భీమవరం జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన గోడపత్రికను జిల్లా కలెక్టరు చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లాలో ఫిబ్రవరి 10న అంగన్వాడి, పాఠశాలలు, కళాశాలల పిల్లలకు ఆల్బెండజోల్ 400 ఎంజి మాత్రలు తప్పనిసరిగా ఇప్పించాలన్నారు.

News February 4, 2025

ఈనెల 6న పీడీఎస్ బియ్యం వేలం..

image

జిల్లాలో నిల్వ ఉన్న 48.330 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్‌ను ఈనెల 6న బహిరంగ వేలం వేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. 6ఎ కేసుల్లో సీజ్ చేసిన ప్రజా పంపిణీ బియ్యాన్ని  ఉండి యం.యల్.యస్ పాయింట్‌లో నిల్వ ఉంచామన్నారు. విచారణ అనంతరం 6ఎ కేసులు ముగియడంతో సీజ్ చేసిన బియ్యాన్ని కేజీ రూ.20 ధర నిర్ణయించి వేలం వేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొనవచ్చన్నారు.

error: Content is protected !!