News July 21, 2024
మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి
ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఈరోజు ఉదయం 8 గంటలకు 37 అడుగుల వద్ద నీటిమట్టం ఉదయం 10 గంటలకు 38 అడుగులు చేరుకుంది. మరో 6 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News October 9, 2024
కొత్తగూడెం: ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు టీచర్లుగా ఎంపిక
కరకగూడెం మండల పరిధిలోని తాటిగూడెం గ్రామ పంచాయతీ విప్పచెట్టు గుంపునకు చెందిన రామటెంకి హనుమంతరావు, జిమ్మిడి రాధ, జిమ్మిడి లీల ప్రవీణ టీచర్లుగా ఎంపికయ్యారు. చిన్న గ్రామం నుంచి ముగ్గురు టీచర్లుగా ఎంపికవడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చొప్పలలో తోలేం మౌనిక ఎస్.జి.టి టీచర్గా ఎంపికయ్యారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
News October 9, 2024
గతంలో మధ్యాహ్న భోజన నిధులు కూడా ఇవ్వలేదు: డిప్యూటీ సీఎం భట్టి
ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెండింగ్ లో ఉన్న కాస్మోటిక్, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేసినట్లు భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అన్ని బిల్లులను పెండింగ్లోనే పెట్టిందన్నారు. కనీసం మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా నిధులు విడుదల చేయలేదన్నారు. ఇక నుంచి ఏ నెల బిల్లు ఆనెలలోనే విడుదల అవుతాయని డిప్యూటీ సీఎం ఖమ్మంలో స్పష్టం చేశారు.
News October 8, 2024
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 4 రోజులు సెలవు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. 10న దుర్గాష్టమి పండుగ, 11న మహర్నవమి పండుగ, 12న విజయదశమి పండుగ, 13న ఆదివారం సందర్భంగా సెలవులిస్తున్నట్లు చెప్పారు. తిరిగి ఈనెల 14వ తేదీ సోమవారం నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.