News January 7, 2025
మొదలైన పంచాయతీ ఎన్నికల సందడి..!

త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవుతుందనే ప్రచారంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఆశావహులు పండుగలు, పబ్బాలకు తాయిలాలు ఇస్తుండడమే కాక శుభ, అశుభ కార్యాల్లో స్థానికులతో మమేకమవుతున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 589 పంచాయతీల్లో 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తొంది. ఇప్పటికే నామినేషన్ పత్రాలు జిల్లాకు చేరుకున్నాయి.
Similar News
News December 22, 2025
ఖమ్మం జిల్లా రైతులకు రూ.68 కోట్ల బోనస్ జమ

ఖమ్మం జిల్లాలో సన్నరకం ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ సొమ్మును ఖాతాల్లో జమ చేస్తోంది. వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 22,000 మంది రైతులకు రూ.68.34 కోట్లు చెల్లించారు. ఇంకా 11,900 మందికి రూ.34.06 కోట్లు అందాల్సి ఉంది. అత్యధికంగా కల్లూరు మండలంలో రూ.20.28 కోట్లు, వేంసూరులో రూ.8.87 కోట్లు జమ చేశారు. మిగిలిన బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని అధికారులు వెల్లడించారు.
News December 22, 2025
ఖమ్మంలో ఇవాళ డజన్ కోడిగుడ్లు రూ.90

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ రైతు మార్కెట్లో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.50, వంకాయ 20, బెండకాయ 50, పచ్చిమిర్చి 46, కాకర 56, కంచకాకర 60, బోడకాకర 140, బీరకాయ 56, సొరకాయ 20, దొండకాయ 44, క్యాబేజీ 30, ఆలుగడ్డ 20, చామగడ్డ 26, క్యారెట్ 40, బీట్రూట్ 36, కీరదోస 26, బీన్స్ 50, క్యాప్సికం 46, ఉల్లిగడ్డలు 45, కోడిగుడ్లు(12) రూ.90 గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.
News December 22, 2025
ఖమ్మం @ 8,095

ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 8,095 కేసులు పరిష్కారమయ్యాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో జరిగిన ఈ అదాలత్లో అత్యధికంగా 6,394 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 999 క్రిమినల్, 370 చెక్ బౌన్స్, 144 బ్యాంక్, 37 సైబర్, కుటుంబ తగాదాలు 20, ఈపీలు 09 పరిష్కారమైయ్యాయి. రాజీ మార్గమే రాజమార్గమని, దీనివల్ల కక్షిదారులకు సమయం, ధనం ఆదా అవుతాయని న్యాయాధికారులు పేర్కొన్నారు.


