News December 13, 2024
మోడల్ నమూనా పనులకు పొంగులేటి శంకుస్థాపన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734071495367_51989201-normal-WIFI.webp)
కూసుమంచి మండల తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇంటి మోడల్ నమూనా నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి శంకుస్థాపన చేశారు. పేదవాడి ఇంటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని చెప్పారు. ఆయన వెంట కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉన్నారు.
Similar News
News January 22, 2025
ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలి: ఖమ్మం కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737551606316_1280-normal-WIFI.webp)
ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధాన ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, వెయిటింగ్ హాల్, ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటర్, దోబీ మిషనరీస్, ఎంపీహెచ్డబ్ల్యూ, ట్రైనింగ్ సెంటర్ను పరిశీలించారు.
News January 22, 2025
ఖమ్మం: ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా: సీపీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737548047222_1280-normal-WIFI.webp)
ఖమ్మం జిల్లా టీఎన్జీవోస్ సంఘం నూతన కమిటీ ఇటీవల నియామకమైంది. నూతన సభ్యులు ఖమ్మం సీపీ సునీల్ దత్ని కమిషనరేట్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీపీ నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కారంలో తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు.
News January 22, 2025
కన్నులపండువగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737533127107_52368886-normal-WIFI.webp)
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని కన్నులపండుగగా నిర్వహించారు.