News March 5, 2025

మోతెలో గుండెపోటుతో యువకుడు మృతి

image

ఉపాధి హామీ పథకం పనికి వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం కూడలి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని కూడలి గ్రామానికి చెందిన నిమ్మరబోయిన మహేశ్(32) రోజు మాదిరిగా ఉపాధి హామీ కూలీ పనికి వెళ్ళాడు. మధ్యాహ్న సమయంలో చాతి వద్ద నొప్పి లేస్తుందని ఇంటికి వెళ్లాడు. అనంతరం వాంతులు అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక వైద్యుడు వద్దకు తీసుకెళ్లలోపే గుండెపోటు రావటంతో మరణించాడు.

Similar News

News February 25, 2026

VKB: ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్.. 272 మంది ABSENT

image

ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 272 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. బుధవారం జిల్లాలో 8,672 మంది విద్యార్థులకు గానూ 8,400 మంది విద్యార్థులు మొదటి పరీక్షకు హాజరు కాగా 272 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చెప్పారు. జనరల్- 7,262 మంది విద్యార్థులకు 7,080 మంది హాజరుకాగా 182 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్- 1410 మందికి 1,320 హాజరుకాగా 90 మంది గైర్హాజరయ్యారు.

News February 25, 2026

సీఎంను ప్రత్యేకంగా ఆకట్టుకున్న ఓ విద్యార్థిని చిత్రలేఖనం

image

మార్కాపురం బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రాల అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు వివరించారు. ఆ దేవుడితో పెట్టుకుంటే పతనం ఖాయమని హెచ్చరించారు.

News February 25, 2026

అనిల్ అంబానీ ముంబై నివాసం అటాచ్

image

మనీ లాండరింగ్ కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్ ఇచ్చింది. ముంబైలోని ఆయన నివాసం ‘అబోడ్’ను అటాచ్ చేసింది. పాలిహిల్ ప్రాంతంలో ఉన్న ఈ 17 ఫ్లోర్ల లగ్జరీ భవనం విలువ రూ.3,716 కోట్లు. దీంతో ఇప్పటివరకు మొత్తం ఆస్తుల <<18184400>>జప్తు<<>> విలువ రూ.15,700 కోట్లకు చేరింది. ఈ కేసులో అనిల్ మరోసారి ఢిల్లీలోని ఈడీ ఎదుట త్వరలో హాజరుకానున్నారు. గతేడాది ఆగస్టులో ఆయన ఈడీ విచారణ ఎదుర్కొన్నారు.