News March 4, 2025
మోతె: ఇందిరమ్మ మోడల్ హౌస్ను పరిశీలించిన కలెక్టర్

మోతె మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ను మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు అందజేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవన్నారు.
Similar News
News January 5, 2026
ఇరుసుమండ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా!

ఇరుసుమండలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. దీనిపై కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. లీక్ ను నియంత్రించాలన్నారు.
News January 5, 2026
KNR: నిలిచిన రిజిస్ట్రేషన్లు.. మూడు రోజులుగా ఇదే గోస!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సాంకేతిక విఘాతం ఏర్పడింది. గత 3రోజులుగా సర్వర్ మొరాయిస్తుండటంతో క్రయవిక్రయాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకున్న వారు కార్యాలయాల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఫైళ్లు పెండింగ్లో పడటంతో రిజిస్ట్రేషన్లు వాయిదా పడుతున్నాయి. సాంకేతిక లోపాన్ని సరిదిద్ది ప్రక్రియను త్వరలోనే పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.
News January 5, 2026
వారానికి 5 రోజులే పని చేస్తామని డిమాండ్.. కరెక్టేనా?

వారానికి 5 రోజులే పని చేస్తామని బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడం హాట్ టాపిక్గా మారింది. UPIతో పనిభారం చాలా వరకు తగ్గిందని.. ఇప్పటికే రెండు, నాలుగో శనివారాలు సెలవులు ఉన్నాయి కదా అని పలువురు గుర్తు చేస్తున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్, ప్రొడక్టివిటీ పెంచేందుకు సెలవులు అవసరమని ఉద్యోగులు అంటున్నారు. వారానికి రెండు సెలవులతో బ్యాంకుల మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. COMMENT?


