News March 3, 2025
మోత్కూరు: సహజీవనం.. బాలిక సూసైడ్

మోత్కూరు మండలంలో ఆదివారం <<15633955>>బాలిక <<>> సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. ఆరెగూడెంకు చెందిన మున్నతో బాలికకు ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో యువకుడి తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఓ గదిలో DEC నుంచి కలిసి ఉంటున్నారు. మున్న ఆదివారం HYD వెళ్లగా బాలిక సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబీకులు, యువకుడు వచ్చాక ఆత్మహత్యకు గల కారణాలు చెప్తామని SI తెలిపారు.
Similar News
News November 17, 2025
కోదాడ: ‘ప్రతి రంగంలోనూ మహిళల అద్భుత ప్రతిభ’

మానవ వికాసంలో మహిళల శ్రమ పెద్ద విప్లవం అని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు డి. స్వరూప అన్నారు. కోదాడలో ఆదివారం నిర్వహించిన సూర్యాపేట జిల్లా రాజకీయ శిక్షణా తరగతుల్లో ఆమె మాట్లాడారు. గణ సమాజం నుంచి నేటి అంతరిక్ష పరిశోధనల వరకు ప్రతి రంగంలోనూ స్త్రీలు అద్భుత ప్రతిభ చూపారని కొనియాడారు. అయితే సమాజం మారుతున్న క్రమంలో స్త్రీని అణగదొక్కారని విమర్శించారు.
News November 17, 2025
‘మైథాలజీ’తో మ్యాజిక్.. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా!

పురాణాలు, ఇతిహాసాలను లింక్ చేస్తూ టాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమాలు సూపర్ సక్సెస్ అందుకుంటున్నాయి. పురాణ పురుషుల కథలతో వచ్చిన కల్కి(మహాభారతం), హనుమాన్(రామాయణం), కార్తికేయ-2(శ్రీకృష్ణుడు), మిరాయ్(అశోకుడు, శ్రీరాముడు) వంటి చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలోని ‘వారణాసి’, చిరంజీవి-వశిష్ట మూవీ ‘విశ్వంభర’ ఈ కోవలోనివే కావడం గమనార్హం.
News November 17, 2025
బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ‘బ్లూ బుక్’: మోదీ

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంజినీర్లు తమ అనుభవాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని PM మోదీ సూచించారు. తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నుంచి నేర్చుకున్న విషయాలను ‘బ్లూ బుక్’లా సంకలనం చేయాలని చెప్పారు. ఏం చేశారనేదే కాకుండా ఒక్కో నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయం భవిష్యత్ టీమ్స్కు తెలుస్తుందని తెలిపారు. సూరత్లోని రైల్వే కారిడార్లో ఇంజినీర్లు, కార్మికులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు.


