News September 17, 2024
మోదవలస వద్ద ప్రమాదం.. ఇద్దరు స్పాట్డెడ్
విశాఖ నుంచి విజయనగరం వెళ్లే రోడ్డు మార్గంలో మోదవలస వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగి ఉన్న లారీ వెనుక భాగాన్ని వేగంగా వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 15, 2024
విజయనగరం జిల్లాలో మద్యం లాటరీలో నిరాశలు
➤ విజయనగరం జిల్లాలో ఓ సిండికేట్ 500కు పైగా దరఖాస్తులు వేశారు.
➤ వారు దరఖాస్తులకు రూ.10 కోట్లు పెట్టారు.
➤ వారికి దక్కింది మాత్రం 8 షాపులే..!
➤ టీడీపీ నేత 25 దరఖాస్తులు వేశారు.
➤ ఆయకు ఒకే ఒక్క షాపు తగిలింది.
➤ వైసీపీ నేత 50 దరఖాస్తులు వేశారు.
➤ అతనికి మూడు షాపులు వచ్చాయి.
News October 15, 2024
విజయనగరం కళలకు పుట్టినిళ్లు: హోం మంత్రి
విజయనగరం కళలకు పుట్టినిల్లు అని రాష్ట్ర హోమ్ శాఖా మంత్రి వంగలపూడి అనిత కొనియాడారు. రెండురోజులపాటు ఘనంగా నిర్వహించిన విజయనగరం ఉత్సవాల ముగింపు సభలో సోమవారం రాత్రి హోమ్ మంత్రి మాట్లాడారు. విజయనగరం ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. నగరంలో ఏ మూల చూసినా కళా ప్రదర్శనలతో కోలాహలంగా ఉందని అన్నారు. ఘంటసాల, సుశీల లాంటి ఎంతోమంది ప్రఖ్యాతి పొందిన కళాకారులు ఇక్కడ నుంచే వచ్చారన్నారు.
News October 15, 2024
విజయనగరంలో NO.1 అదృష్టవంతులు వీళ్లే..!
మద్యం షాపుల లాటరీలో ఈ ముగ్గురు అదృష్టవంతులనే చెప్పాలి. ఆయా మద్యం షాపులకు మొదటి దరఖాస్తు సమర్పించిన ముగ్గురికి లాటరీలో షాపులు దక్కాయి. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో తొలి టెండర్ వేసిన కనకల కృష్ణ, చీపురుపల్లిలో నామాల గణపతి, గజపతిగరంలో కుమిలి శ్రీనుకు టోకెన్ నంబర్లు 1గా కేటాయించారు. అనూహ్యంగా లాటరీలో సైతం వీళ్ల టోకనే రావడంతో షాపులు వారికే ఇచ్చారు. ఈ ముగ్గురి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.