News March 28, 2025

మోదీ, చంద్రబాబు, పవన్ ఫొటోలకు పాలాభిషేకం

image

సూర్యలంక సముద్ర తీర అభివృద్ధికి రూ.97 కోట్లు మంజూరు కావడంపై కూటమి నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈక్రమంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చిత్రపటాలకు సూర్యలంక సముద్రతీరం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ.. బాపట్లలో పర్యాటక రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Similar News

News September 14, 2025

కరీంనగర్‌లో మినీ ‘సరస్ ఫెయిర్’

image

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణం అంబేడ్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ నెల 18 వరకు మిని సరస్ ఫెయిర్ 2025 నిర్వహిస్తుట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన చేనేత హస్త కళల, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయన్నారు.

News September 14, 2025

కొడుకును చంపి నదిలో పడేశాడు!

image

TG: హైదరాబాద్ బండ్లగూడ PS పరిధిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు అనాస్(3)ను తండ్రి అక్బర్ దారుణంగా హత్య చేసి సంచిలో మూట కట్టి మూసీ నదిలో పడేశాడు. అనంతరం బాలుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. దీంతో కేసు నమోదు చేసి మూసీలో బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.

News September 14, 2025

HYD: కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీ అరెస్ట్

image

ప్లాట్ల అమ్మకం ముసుగులో చీటింగ్ చేసి పరారీలో ఉన్న కృతిక ఇన్‌ఫ్రా డెవలపర్స్ ఎండీని LBనగర్ SOT బృందం, LBనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రదేశాల్లో ప్లాట్లను అమ్మే ముసుగులో భారీగా డబ్బు కాజేసి చాలా మందిని మోసం చేసిన ఆదిభట్లకు చెందిన శ్రీకాంత్(35)ను జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతడిపై సరూర్‌నగర్, వనస్థలిపురం, మేడిపల్లిలో కేసులు ఉన్నాయని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.