News September 16, 2024

మోపాల్: వైద్య సిబ్బందికి మెమోలు జారీ చేసిన DM&HO

image

మోపాల్ మండలంలోని ముదక్పల్లి PHCలో ఆయూష్ వైద్యురాలికి, సిబ్బందికి DM&HO రాజశ్రీ మెమోలు జారీ చేశారు. ఇటీవల PHCని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేసిన సమయంలో వారు విధులకు గైర్హాజరు అయ్యారు. విధులకు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో వారికి కలెక్టర్ నోటీసులిచ్చారు. కాగా PHC ఇన్‌ఛార్జ్ డ్రాయింగ్ ఆఫీసర్‌గా డిప్యూటీ DM&HO అంజనకు బాధ్యతలు అప్పగించారు.

Similar News

News February 25, 2026

నిజామాబాద్: కో-ఆప్షన్ పదవులపై ఆశావహుల కన్ను

image

మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో కార్పొరేటర్లతో సమాన హోదా కలిగిన కో-ఆప్షన్ సభ్యుల పదవుల కోసం నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఐదుగురికి, మున్సిపాలిటీల్లో నలుగురికి ఈ అవకాశం ఉండనుంది. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ప్రకారం 45 రోజుల్లోనే ఈ పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. త్వరలో నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఆశావహులు ముఖ్యనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

News February 25, 2026

నిజామాబాద్: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 36,963 మంది విద్యార్థుల కోసం 58 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని, 9:05 వరకు మాత్రమే అనుమతిస్తామని డీఐఈవో తెలిపారు. మాస్ కాపీయింగ్ నివారణకు 3 ఫ్లయింగ్, 8 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుంది.

News February 25, 2026

నిజామాబాద్: పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో సెల్‌ ఫోన్లు నిషేదం

image

మార్చి 14 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు, సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు తీసుకురావద్దని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.