News January 24, 2025

మోసపూరిత ప్యాకేజీలతో మోసం చేయోద్దు: శైలజానాథ్

image

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న దీక్షా శిబిరాన్ని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ శుక్రవారం సందర్శించారు. శిబరంలో కూర్చుని కార్మికులతో చర్చించారు. ప్రకటించిన ప్యాకేజీ ఏ మేరకు లబ్ది చేకూరుతుంది.. ఎలాంటి అంశాలు అవసరమో అడిగి తెలుసుకున్నారు. మోసపూరిత ప్యాకేజీలతో స్టీల్ ప్లాంట్‌‌కు అన్యాయం చేయొద్దని అన్నారు. సెయిల్‌లో విలీనం చేసి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 7, 2025

విశాఖ మీదుగా వెళ్లే యశ్వంత్పూర్ రైలు రద్దు

image

టాటా నగర్ నుంచి విశాఖ మీదగా యశ్వంత్పూర్ వెళ్లే రైలును(18111/12) ఫిబ్రవరి 6,13 తేదీలలో రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఖమ్మం డివిజన్‌లో ఇంటర్ లాకింగ్, నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టడం వలన రైలును రద్దు చేసినట్లు తెలిపారు. యశ్వంత్పూర్ నుంచి విశాఖ మీదగా టాటానగర్ వెళ్లే రైలు కూడా ఫిబ్రవరి 6,13 తేదీలలో రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News February 7, 2025

విశాఖ: టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మరో నామినేషన్

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి శుక్రవారం నాలుగు నామినేషన్‌లు దాఖలు అయ్యాయి. పీఆర్టీయూ మ‌ద్ద‌తుతో బ‌రిలోకి దిగిన‌ మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, స్వ‌తంత్ర అభ్య‌ర్థులు నూక‌ల సూర్యప్ర‌కాష్‌,రాయ‌ల స‌త్య‌న్నారాయ‌ణ‌, పోతల దుర్గారావు త‌మ మ‌ద్ద‌తుదారుల‌తో క‌లిసి రిట‌ర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ వారి చేత ప్రమాణం చేయించారు.ఇప్పటి వరకు మొత్తం 8 నామినేషన్లు వచ్చాయి.

News February 7, 2025

కేజీహెచ్‌లో బాలిక ప్రసవం.. మరణించిన శిశువు

image

కేజీహెచ్‌లో <<15384408>>బాలిక ప్రసవించిన <<>>ఘటనలో విషాదం చోటుచేసుకుంది. నెలలు నిండకముందే ఆరునెలల మగబిడ్డకు జన్మనివ్వగా ఆ శిశువు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ బాలిక భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కళాశాలలో చదువుతుంది. ప్రేమ పేరుతో శారీరకంగా కలిసిన ఓ యువకుడు ఆమెను గర్భవతి చేశాడు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చీడికాడ స్టేషన్‌కు కేసు బదిలీ చేసినట్లు భీమిలి సీఐ సుధాకర్ తెలిపారు.

error: Content is protected !!