News February 11, 2025
మోసపూరిత SMSలపై అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు SP

వివిధ బ్యాంకుల పేర్లతో వచ్చే మోసపూరిత SMSల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు SP జి.కృష్ణకాంత్ సోమవారం సూచించారు. బ్యాంకుల పేర్లతో పంపిస్తున్న అప్లికేషన్లను ఇన్స్టాల్ చేయొద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకుల పేరుతో SMSలు పంపి వలవేస్తారని అన్నారు. ప్రజలు వారి వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News March 25, 2025
48 గంటల్లోగా నగదు జమ: నెల్లూరు జేసీ

జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 40,285.32 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కార్తీక్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 3336.72 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జేసీ వెల్లడించారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ 24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల ఖాతాలకు డబ్బులు జమ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
News March 24, 2025
నెల్లూరు: పోలీస్ గ్రీవెన్స్కి 86 ఫిర్యాదులు

నెల్లూరు జిల్లా ఎస్పీ యస్. కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు ఉమేశ్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఏఎస్పీ సౌజన్య నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వివిధ సమస్యలపైన వినతులను అధికారులకి అందచేశారు. పరిష్కార వేదికకు మొత్తం 86 ఫిర్యాదులు వచ్చాయని ఏఎస్పీ తెలిపారు.
News March 24, 2025
76 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.143 కోట్లు: ఆనం

రాష్ట్రంలో 76 ఆలయాల పునర్నిర్మాణానికి రూ.143 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని మూలాపేట వేణుగోపాలస్వామి దేవస్థానంలో ఆలయ పాలకమండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంశపారంపర్యంగా ఆలయ ధర్మకర్తలుగా పని చేస్తున్నామన్నారు. వేణుగోపాల స్వామి దేవాలయంలో పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.