News April 19, 2024
మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్లో శంకర్పల్లి వాసి

శంకర్పల్లి మున్సిపాలిటీ వివేకానంద నగర్ కాలనీకి చెందిన దండుగుల వెంకటేష్ నేపాల్లోని ఖుంజంగ్ మౌంట్ ఎవరెస్టు సమ్మిట్ బేస్ క్యాంపు పాల్గొని 5364 మీటర్ల ఎత్తు గల పర్వతాన్ని అధిరోహించారు. తన మిత్రుడు నరేష్ రెడ్డితో కలిసి సుమారు వారం రోజులపాటు సాగిన ఈ ట్రెక్కింగ్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను ముగించుకున్నారు. ఎత్తైన పర్వతంపై భారతదేశపు మువ్వన్నెల జెండాను ఎగరవేయడం గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
HYD: మహా GHMCలో 250 డివిజన్లు.!

గ్రేటర్లో శివారు ప్రాంతాలు విలీనమైన నేపథ్యంలో డివిజన్ల పునర్విభజన జరుగుతోంది. స్థానిక సంస్థలను డివిజన్లను జీహెచ్ఎంసీ అధికారులు మారుస్తున్నారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోకి కొత్తగా 50 డివిజన్లు చేరనున్నాయి. వీటితో జీహెచ్ఎంసీలో 220 నుంచి 250 వరకు డివిజన్లు అవనున్నాయి. ఇప్పటికే జనాభా లెక్కన డివిజన్లను విభజించారు. దీంతో మహా జీహెచ్ఎంసీ 10 జోన్లు, 50 సర్కిళ్ళుగా మారుతుంది.
News December 6, 2025
HYD: HMDA వేలంపాట్లతో రూ.3,862.8 కోట్ల ఆదాయం!

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) తన చారిత్రక భూ వేలంపాట్ల సిరీస్ను విజయవంతంగా ముగించింది. ఇటీవల 1.98 ఎకరాల గోల్డెన్మైల్ స్థలాన్ని COEUS ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్క ఎకరాకు రూ.77.75 కోట్లకు పొందింది. ఈ ఫలితంతో, వేలంపాట్ల ద్వారా HMDA మొత్తం ఆదాయం రూ.3,862.8 కోట్లకు చేరింది.
News December 6, 2025
HYD: HMDA వేలంపాట్లతో రూ.3,862.8 కోట్ల ఆదాయం!

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) తన చారిత్రక భూ వేలంపాట్ల సిరీస్ను విజయవంతంగా ముగించింది. ఇటీవల 1.98 ఎకరాల గోల్డెన్మైల్ స్థలాన్ని COEUS ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్క ఎకరాకు రూ.77.75 కోట్లకు పొందింది. ఈ ఫలితంతో, వేలంపాట్ల ద్వారా HMDA మొత్తం ఆదాయం రూ.3,862.8 కోట్లకు చేరింది.


