News July 8, 2024
మౌలిక సౌకర్యాల కల్పనే ద్వేయం: మంత్రి రాజనర్సింహ

ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కళాశాలు, ఆసుపత్రులలో మౌలిక సౌకర్యాలు మెరుగుపరుస్తూ అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి మ్యాప్ను ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. సామాన్యుడు మెచ్చే విధంగా సర్కారు దవాఖానాలను తీర్చిదిద్దేందుకు సీఎం ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు.
Similar News
News December 18, 2025
MBNR: సర్పంచ్ ఎన్నికలు..70 నాఖాబందీ ఆపరేషన్లు

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగా 70 నాఖాబందీ ఆపరేషన్లు, 37 ఆయుధాల డిపాజిట్, 640 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 3 చెక్పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగిందని, అలాగే రూ.7,200/- విలువగల ఉచితాల పంపిణీకి సంబంధించిన 1 కేసు, 3 ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులు, 4 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.
News December 18, 2025
MBNR: సర్పంచ్ ఎన్నికలు.. రూ.11,08,250 సీజ్

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో భాగంగా చేపట్టిన తనిఖీలు, నిఘా చర్యలలో రూ.11,08,250 నగదును సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ డి.జానకి వెల్లడించారు. అదేవిధంగా రూ.6,93,858 విలువగల మద్యం కేసులకు సంబంధించి 81 ఎక్సైజ్ కేసులు నమోదు చేసి 1050.23 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
News December 18, 2025
MBNR: లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి: SP

ఈ నెల 21 న జిల్లాలో జరిగే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జానకి గురువారం ఓ ప్రకటనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. క్షణికా వేషంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి లోక్ అదాలత్ కార్యక్రమం ఉత్తమ అవకాశమని, రాజీ మార్గానికి అవకాశం ఉన్న అన్ని కేసులను పరిష్కరించుకోవాలని కక్షదారులకు సూచించారు.


