News August 12, 2024

మౌస్ డీర్ సంతతి కేంద్రంగా నెహ్రూ జూపార్క్

image

నెహ్రూ జూపార్క్ మూషిక జింకల (మౌస్ డీర్) సంతతి వృద్ధి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇండియన్ వైల్డ్ యానిమల్ యాక్ట్ 1972 ప్రకారం అంతరించిపోతున్న జంతువుల జాబితాలోని షెడ్యూల్-1లో మూషిక జింకను చేర్చారు. దేశంలో ఇవి కనుమరుగవుతున్న నేపథ్యంలో 2010 మార్చి 3న, నెహ్రూ జూపార్క్‌ను ఢిల్లీ సెంట్రల్ జూ అథారిటీ వాటి సంతతి కేంద్రంగా దీన్నిిి గుర్తించింది. ఆ తర్వాత ఇందులో 500 మూషిక జింకలు జన్మించాయి.

Similar News

News October 1, 2024

రంగారెడ్డి కోర్టులో జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ

image

రంగారెడ్డి జిల్లా కోర్టులో లైంగిక ఆరోపణల కేసులో అరెస్టయిన జానీ మాస్టర్‌ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు అయ్యింది. జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై నేడు రంగారెడ్డి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే జానీ మాస్టర్‌ను 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించారు. జానీ మాస్టర్‌ఫై అత్యాచార కేసుతో పాటు ఫోక్సో కేసు నార్సింగ్ పోలీసులు నమోదు చేశారు.

News October 1, 2024

HYD: హైడ్రాను రద్దు చెయ్యాలని హైకోర్టులో పిటిషన్

image

హైడ్రా జీవో నెంబర్ 99ను రద్దు కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవోను కొట్టేయాలని 2 వేర్వేరు పిటిషన్లు దాఖాలు అయ్యాయి. పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ చేయనుంది. హైడ్రాకు చట్టబద్ధత లేదని, జీవో నెంబర్ 99ను వెంటనే రద్దు చేయాలను కోరుతూ పిటీషన్ దాఖలు కావడంతో దీని తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News October 1, 2024

రాజస్థాన్‌లో HYD పోలీస్ ఆపరేషన్ SUCCESS

image

రాజస్థాన్‌లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. రాజస్థాన్ కేంద్రంగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న కేటుగాళ్లకోసం రిక్కీ నిర్వహించారు. పక్కా ప్లాన్‌తో వారి స్థావరాలపై మెరుపుదాడి చేసి 27 మందిని అరెస్ట్ చేశారు.