News January 30, 2025

మ్ముమిడివరం: ‘ఈవీఎం, వీవీ ప్యాడ్‌లకు పటిష్ట భద్రత’

image

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు, వివి ప్యాడ్ లకు పటిష్ట భద్రత చేకూర్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు ముఖ్య కార్యనిర్వాహక అధికారి తాతబ్బాయి అన్నారు. గురువారం ముమ్మిడివరంలోని ఎయిమ్స్ కళాశాలలో మూడో అంతస్తులో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాములను ఆయన తనిఖీలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.ఎల్.ఎన్ రాజకుమారితో కలిసి ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణ గూర్చి అధికారులతో చర్చించారు.

Similar News

News March 13, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

> కోయ్యూరులో అర్థరాత్రి మార్గమధ్యలో ప్రసవం
>జిల్లాలో భూములు రిజిస్ట్రేషన్ చేయండి
>దేవీపట్నంలో పెళ్లి రోజే ఆమెకు చివరి రోజు
>అల్లూరిలో ఇంటర్ పరీక్షలకు 301మంది గైర్హాజరు
>రంపచోడవరంలో జీడిపిక్కలు కొనుగోలు చేస్తాం
>రాజవొమ్మంగిలో ఠారెత్తిస్తున్న ఎండలు..నిర్మానుష్యంగా రహదారులు
>పాడేరు జనసేన నేతపై దాడి..కేజీహెచ్‌కు తరలింపు
>అరకులో పర్యటించిన సీఆర్డీ జాయింట్ కమిషనర్

News March 13, 2025

‘శ్రీ సత్య సాయి జిల్లాను నేర రహిత జిల్లాగా మారుద్దాం’

image

శ్రీ సత్య సాయి జిల్లాని నేర రహిత జిల్లాగా మారుద్దామని ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం సాయంత్రం హిందూపురం సమీపంలోని అప్పలకొండ క్రాస్ వద్ద డీఎస్పీ మహేశ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. హక్కులను వినియోగించుకొని జిల్లాలను నేర రహిత జిల్లాగా మారుద్దాం అన్నారు.

News March 13, 2025

పాడేరు: ‘కవయిత్రి మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి’

image

నేటి యువత, విద్యార్థిని, విద్యార్థులు కవయిత్రి మొల్లమాంబ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని స్ఫూర్తి పొందాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కవయిత్రి మొల్ల జయంతిని నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. రామాయణాన్ని సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రచించారని కొనియాడారు.

error: Content is protected !!