News January 30, 2025

మ్ముమిడివరం: ‘ఈవీఎం, వీవీ ప్యాడ్‌లకు పటిష్ట భద్రత’

image

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు, వివి ప్యాడ్ లకు పటిష్ట భద్రత చేకూర్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు ముఖ్య కార్యనిర్వాహక అధికారి తాతబ్బాయి అన్నారు. గురువారం ముమ్మిడివరంలోని ఎయిమ్స్ కళాశాలలో మూడో అంతస్తులో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాములను ఆయన తనిఖీలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.ఎల్.ఎన్ రాజకుమారితో కలిసి ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రక్షణ గూర్చి అధికారులతో చర్చించారు.

Similar News

News December 11, 2025

​పంచాయతీ రాజ్ వ్యవస్థలదే కీలక పాత్ర: జీవీఎంసీ కమిషనర్

image

దేశ జనాభాలో 70 శాతం మందికి సేవలందిస్తున్న పంచాయతీ రాజ్ వ్యవస్థల పాత్ర కీలకమని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. ఐఐఎం విశాఖలో పంచాయతీ రాజ్ అధికారుల కోసం నిర్వహించిన నాయకత్వ శిక్షణ ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. అధికారుల నైపుణ్యాలను పెంచేలా ఐఐఎం రూపొందించిన శిక్షణా విధానాన్ని ప్రశంసించారు. 2026 మార్చి నాటికి 500 మంది అధికారులకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

News December 11, 2025

క్రీడారంగం అభివృద్ధిపై రాజ్యసభలో ప్రస్తావించిన ఎంపీ సతీష్

image

రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఖేలో ఇండియా కార్యక్రమాలపై రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ గురువారం రాజ్యసభలో ప్రస్తావించారు. దీనికి కేంద్రం క్రీడాశాఖ మంత్రి మాండవీయ బదులిస్తూ రాష్ట్రాల వారీగా కాకుండా పథకాల వారీగా నిధులు ఇస్తున్నట్లు తెలిపారని ఎంపీ కార్యాలయం వెల్లడించింది. గత ఐదేళ్లుగా కాకినాడ జిల్లాలకు క్రీడల కోసం నిధుల మంజూరుపై రికార్డులు లేవని మంత్రి తెలిపారన్నారు.

News December 11, 2025

MDK: ఆ ఊరిలో ఒక్క ఓటు తేడాతో గెలుపు

image

రేగోడ్ మండలంలో కొండాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బేగరి పండరి విజయం సాధించారు. సమీప ప్రత్యర్ధి హరిజన సత్తయ్య మీద ఒక ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్ పార్టీ అనుచరులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.