News April 24, 2025

యలమంచిలిలోని కొంతేరులో హత్య

image

యలమంచిలి మండలం కొంతేరులో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. సరిహద్దు గొడవల నేపథ్యంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న కత్తుల పౌలు (58)ను బత్తుల ఏసుదాసు నరికాడు. మెడపై తీవ్రగాయాలు కావడంతో పౌలు మంచంపై మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని నరసాపురం డీఎస్పీ జి. శ్రీవేద, పాలకొల్లు రూరల్ సీఐ జి. శ్రీనివాస్, ఎస్సై కె. గుర్రయ్య పరిశీలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News April 25, 2025

భీమవరం: విద్యార్థులను సత్కరించిన కలెక్టర్ 

image

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి మెరుగైన ఫలితాలను సాధించిన విద్యార్థులు అభినందనీయులని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం కాళ్ల మండలం పెదమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు పొందిన 10 మంది విద్యార్థులకు మెమొంటోలు అందజేసి సత్కరించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News April 24, 2025

భీమవరంలో యాంకర్ అనసూయ సందడి

image

భీమవరంలో సినీనటి అనసూయ సందడి చేశారు. గురువారం భీమవరంలోని ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె వచ్చారు. అనసూయను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. భీమవరం చాలా సార్లు వచ్చానని, ఇక్కడ అభిమానం ఎప్పటికీ మరవలేనని, ఎన్నిసార్లు అయినా భీమవరం వస్తానని అనసూయ అన్నారు.

News April 24, 2025

ప.గో జిల్లా టాపర్ ఈ బాలికే..!

image

నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం మహాత్మా జ్యోతీ బా పూలే గురుకుల పాఠశాల (బాలికలు)విద్యార్థులు పదో తరగతి ఫలితాలలో ప్రతిభ చూపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రావి అశ్విని 592 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ సీహెచ్ కె. శైలజ తెలిపారు. పెరవలి గ్రామానికి చెందిన అశ్విని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ ఉంటారు.

error: Content is protected !!