News February 14, 2025

యలమంచిలి : లారీ ఢీకొని మహిళ మృతి

image

లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన యలమంచిలి ప్రధాన రహదారిపై గురువారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం.. తాడిగరువుతోటకు చెందిన విజయ నడుచుకుని వెళ్తుండగా.. కొబ్బరిలోడు లారీ ఆమెను ఢీకొంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె ముగ్గురు కుమార్తెలకు వివాహమైంది. భర్త ఇటీవల మృతి చెందినట్లు సమాచారం.

Similar News

News March 13, 2025

భీమవరంలో బాంబు బెందిరింపు.. పలు కోణాల్లో దర్యాప్తు

image

భీమవరం విష్ణు కళాశాలలో బుధవారం బాంబు పెట్టామన్న ఈ మెయిల్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి నుంచి మెయిల్ వచ్చిననట్లు పోలీసులు గుర్తించారు. పార్లమెంటు దాడి ఘటనలో సూత్రధారి అప్జల్ గురుకు శిక్ష విధించినందుకు నిరసనగా కళాశాలలో బాంబు పెట్టినట్లు ఈ మెయిల్‌లో పేర్కొన్నాడు. అది అతడి నుంచి వచ్చిందా? లేదా మరోకరు పంపించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని DSP జయసూర్య తెలిపారు.

News March 13, 2025

నరసాపురం: బాలికపై లైంగికదాడి.. జీవితఖైదు

image

నరసాపురంలో ఒకరి జైలుశిక్ష పడింది. సీఐ బి.యాదగిరి వివరాల ప్రకారం.. నరసాపురం అరుంధతిపేటకు చెందిన పెడరి నర్సింహరాజు పార్కు రోడ్డులో టాయిలెట్లు శుభ్రం చేసేవాడు. ఈక్రమంలో 2017లో ఓ మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. భీమవరం ఫొక్సో కోర్టు జడ్జి B.లక్ష్మీనారాయణ 18మంది సాక్షులను విచారించారు. నర్సింహరాజుకు జీవిత ఖైదు, రూ.5 వేలు జరిమానా విధించారు. బాధితురాలకి రూ.50వేలు చెల్లించాలని తీర్పునిచ్చారు. 

News March 12, 2025

కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మకి తప్పిన ప్రమాదం

image

కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని పార్లమెంట్ సమావేశానికి హాజరై అనంతరం మంత్రిత్వశాఖ కార్యాలయానికి వెళ్తుండగా ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ఆయన కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొంది. వర్మ కాలికి తీవ్ర గాయమైంది. వైద్య బృందం ప్రత్యేక చికిత్స అందించారు. కాలికి బలమైన గాయం కావడం వల్ల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఢిల్లీ నుంచి భీమవరానికి ఆయన బయలుదేరారు.

error: Content is protected !!