News March 10, 2025
యాదగిరిగుట్టకు చేరుకున్న గవర్నర్ విష్ణు దేవ్ వర్మ

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో 10వ రోజు కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు యాదగిరిగుట్టకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వచ్చారు. ఆలయ ఈవో భాస్కర్ రావు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ గొప్పతనాన్ని ఈవో భాస్కరరావు, గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు వివరించారు. మరికాసేపట్లో పూర్ణా హుతిలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొననున్నారు.
Similar News
News October 3, 2025
ఖమ్మం: కలిసొచ్చిన రిజర్వేషన్.. మళ్లీ ఆమే సర్పంచ్..

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు కొంతమందిని నిరాశ కలిగిస్తే మరికొంతమందికి కలిసొచ్చాయి. పెనుబల్లి మండలం గౌరవరంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఒక్క కుటుంబం మాత్రమే ఉంది. ఆ కుటుంబంలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో ఆ కుటుంబంలోని మహిళ రుద్రజారాణి సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మళ్లీ అదే రిజర్వేషన్ రావడంతో సర్పంచ్ పదవి ఆమెకే దక్కనుంది.
News October 3, 2025
‘ఐ లవ్ మోదీ’ అనొచ్చు.. ‘ఐ లవ్ మహమ్మద్’ అనకూడదా: ఒవైసీ

యూపీలోని బరేలీలో ‘<<17838405>>ఐ లవ్ మహమ్మద్<<>>’ అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ధ్వజమెత్తారు. దేశంలో ‘ఐ లవ్ మోదీ’ అంటే ఎలాంటి సమస్య ఉండదని, ‘ఐ లవ్ మహమ్మద్’ అంటే అభ్యంతరమా? అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలతో దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారని నిలదీశారు. తాను మహమ్మద్ వల్లే ముస్లింగా ఉన్నానని పేర్కొన్నారు. దేశంలో 17 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారని తెలిపారు.
News October 3, 2025
శ్రీకాకుళం: మునిగిన రోడ్డు.. సాహసం చేశారు!

భారీ వర్షాలకు నందిగామ మండలం ఉయ్యాలపేట వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరింది. ఆ గ్రామానికి 108 అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు సాహసం చేశారు. కర్రకు డోలీ కట్టి మెయిన్ రోడ్డు వరకు ఆయనను మోసుకెళ్లారు.