News March 10, 2025

యాదగిరిగుట్టకు చేరుకున్న గవర్నర్ విష్ణు దేవ్ వర్మ

image

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో 10వ రోజు కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు యాదగిరిగుట్టకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వచ్చారు. ఆలయ ఈవో భాస్కర్ రావు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ గొప్పతనాన్ని ఈవో భాస్కరరావు, గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు వివరించారు. మరికాసేపట్లో పూర్ణా హుతిలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొననున్నారు.

Similar News

News January 14, 2026

నేడే జ్యోతి దర్శనం.. కిక్కిరిసిన శబరిగిరులు

image

అయ్యప్ప స్వాముల 41 రోజుల కఠిన దీక్షకు ఇవాళ సార్థకత లభించనుంది. సాయంత్రం శబరిగిరుల్లో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. 6.25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై జ్యోతి కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే జ్యోతి రూపంలో దర్శనమిస్తారని స్వాముల ప్రగాఢ విశ్వాసం. దీంతో ఈ దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు మాలధారులు శబరిమలకు పోటెత్తారు. ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.

News January 14, 2026

పతంగ్‌కు పక్కా ప్లాన్.. చెరువు వద్ల కుర్రాళ్ల చిల్ అవుట్!

image

డాబాల మీద డీజే గోల, పతంగుల కోసం కొట్లాటలకు ఈ తరం కుర్రాళ్లు గుడ్ బై చెప్పేస్తున్నారు. నెక్లెస్ రోడ్, గండిపేట లాంటి చెరువు గట్లనే తమ పతంగ్ అడ్డాగా మార్చుకుంటున్నారు. తెల్లవారుజామునే చాయ్ థర్మోస్‌, ఫోల్డబుల్ కైట్స్, మ్యూజిక్ కోసం చిన్న బ్లూటూత్ స్పీకర్‌తో అక్కడ వాలిపోతున్నారు. రొటీన్ రచ్చకు దూరంగా, ప్రశాంతమైన గాలిలో గాలిపటాలు ఎగరేస్తూ సరికొత్త ‘యాంటీ నాయిస్’ కల్చర్‌కు తెరలేపుతున్నారు. మీకూ నచ్చిందా?

News January 14, 2026

చిత్తూరు జిల్లాలో 62 బస్సులకు జరిమానా

image

సంక్రాంతి నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని చిత్తూరు డీటీసీ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఐదు రోజులుగా చేపట్టిన తనిఖీల్లో అధిక ఛార్జీలు వసూలు చేసిన 30 బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. రూ.3 లక్షల మేర జరిమానా విధించినట్లు చెప్పారు. పన్ను చెల్లించని, పర్మిట్ లేని 32 బస్సులను గుర్తించి రూ.2 లక్షల మేరకు జరిమానా వసూళ్లు చేశామన్నారు.