News February 12, 2025

యాదగిరిగుట్ట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

యాదగిరిగుట్ట మండలం గోధుమకుంట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల ప్రకారం.. HYDకు చెందిన ఎండీ అస్లం(27), ఎండీ ఇబ్రహీం సోహెల్‌తో కలిసి బైక్‌పై వరంగల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు బైక్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అస్లం స్పాట్‌లోనే చనిపోగా.. సోహెల్‌ తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడి తండ్రి ఎండీ సలీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Similar News

News February 26, 2026

పార్వతీపురం: ‘వాహనాలకు ఎల్ఈడీ లైట్లు ఉపయోగించకూడదు’

image

రవాణా శాఖ పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఎల్ఈడీ లైట్లు ఉపయోగించకూడదని కలెక్టర్ ప్రభాకర రెడ్డి సూచించారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో రవాణా శాఖ అధికారులతో సమావేశంలో నిర్వహించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రజల్లో అవగాహన పెంపొందించేలా రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదకర మలుపుల్లో గుర్తింపు చిహ్నాలను ఏర్పాటు చేయాలన్నారు.

News February 26, 2026

T20 WC: టాస్ ఓడిన భారత్

image

చెన్నై వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచులో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమ్ఇండియా జట్టులో 2 మార్పులు జరిగాయి. రింకూ స్థానంలో సంజూ, సుందర్ ప్లేస్‌లో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు.
IND: సంజూ శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, వరుణ్, బుమ్రా.
ZIM: మారుమని, బెనెట్, మేయర్స్, బర్ల్, రజా, మున్యోంగా, ముసెకివా, ఇవాన్స్, మపోసా, ముజరబని, ఎంగర్వ.

News February 26, 2026

NLG: ఇంటర్ పరీక్షలు.. రెండో రోజు 286 మంది డుమ్మా..!

image

జిల్లాలో రెండో రోజు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 286 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ వెల్లడించారు. జనరల్ విభాగంలో మొత్తం 11,480 మంది విద్యార్థులకు గాను 11,265 మంది హాజరుకాగా, 215 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,637 మంది విద్యార్థులకు గాను 1,566 మంది హాజరుకాగా, 71 మంది గైర్హాజరయ్యారు.