News February 12, 2025
యాదగిరిగుట్ట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

యాదగిరిగుట్ట మండలం గోధుమకుంట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల ప్రకారం.. HYDకు చెందిన ఎండీ అస్లం(27), ఎండీ ఇబ్రహీం సోహెల్తో కలిసి బైక్పై వరంగల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు బైక్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అస్లం స్పాట్లోనే చనిపోగా.. సోహెల్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడి తండ్రి ఎండీ సలీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Similar News
News March 20, 2025
ALERT: ఆ జిల్లాల్లో ఉరుములు.. వడగండ్ల వానలు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో <
News March 20, 2025
జనగామ కలెక్టరేట్లో ఇఫ్తార్ విందు

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జనగామ కలెక్టరేట్లోని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో గురువారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ హాజరై మాట్లాడుతూ.. ముస్లిం ఆచార సాంప్రదాయం ఆచరిస్తూ.. సమాజం కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News March 20, 2025
ఐపీఎస్ అభిషేక్ మహంతికి స్వల్ప ఊరట

TG: ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి రాష్ట్ర హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. ఆయన్ను ఏపీకి అటాచ్ చేస్తూ కేంద్ర సిబ్బంది శాఖ చేసిన ఉత్తర్వులను ఈ నెల 24 వరకు నిలిపివేసింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అంతకుముందు సిబ్బంది శాఖ నిర్ణయంపై ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో సవాలు చేయగా అక్కడ చుక్కెదురైంది. అనంతరం ఆయన హైకోర్టును ఆశ్రయించారు.