News February 10, 2025
యాదగిరిశునికి భారీగా నిత్య ఆదాయం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి కి భారీగా నిత్య ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఆదివారం 2600 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.1,30,000, ప్రసాద విక్రయాలు రూ.18,16,400, VIP దర్శనాలు రూ.9,30,000, బ్రేక్ దర్శనాలు రూ.3,07,500, కార్ పార్కింగ్ రూ.6,59,000, యాదరుషి నిలయం రూ.2,67,116, ప్రధాన బుకింగ్ రూ.2,47,650, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.49,00,371 ఆదాయం వచ్చింది.
Similar News
News November 15, 2025
శంషాబాద్: ఉజ్బెకిస్థాన్ మహిళను డిపార్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు

హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న ఉజ్బెకిస్థాన్ మహిళను అధికారులు డిపార్ట్ చేశారు. వీసా గడువు లేకుండా ఉన్నట్లు గుర్తించిన మిస్ బోడానోవా జిబాష్ను నిన్న రాత్రి ఎఫ్జెడ్–436 విమానం ద్వారా దుబాయ్కు పంపించారు. బంజారాహిల్స్ పోలీస్ సిబ్బంది ఆమెను డిపార్చర్ గేట్ వరకు ఎస్కార్ట్ చేయగా, అనంతరం ఎయిర్లైన్స్ సిబ్బంది, BOI అధికారులు పర్యవేక్షణలో విమానంలోకి ఎక్కించారు.
News November 15, 2025
శంషాబాద్: ఉజ్బెకిస్థాన్ మహిళను డిపార్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు

హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న ఉజ్బెకిస్థాన్ మహిళను అధికారులు డిపార్ట్ చేశారు. వీసా గడువు లేకుండా ఉన్నట్లు గుర్తించిన మిస్ బోడానోవా జిబాష్ను నిన్న రాత్రి ఎఫ్జెడ్–436 విమానం ద్వారా దుబాయ్కు పంపించారు. బంజారాహిల్స్ పోలీస్ సిబ్బంది ఆమెను డిపార్చర్ గేట్ వరకు ఎస్కార్ట్ చేయగా, అనంతరం ఎయిర్లైన్స్ సిబ్బంది, BOI అధికారులు పర్యవేక్షణలో విమానంలోకి ఎక్కించారు.
News November 15, 2025
గుండెపోటుతో టీచర్ మృతి

అవుకులో ప్రభుత్వ ఉపాద్యాయుడు గుండెపోటుతో మృతి చెందారు. అవుకుకు చెందిన విజయ్ గత డీఎస్సీలో ఉద్యోగం సాధించి పాణ్యం గురుకుల పాఠశాలలో నెలక్రితం ఉద్యోగంలో చేరారు. శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. విజయ్ మృతితో కుటుంబంతో పాటు అవుకులో విషాదం నెలకొంది.


