News March 26, 2025

యాదగిరి శ్రీవారి నిత్యా ఆదాయం రూ.22,79,976.

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి
నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో
భాస్కరరావు వెల్లడించారు. మంగళవారం
900మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.45,000, ప్రసాద విక్రయాలు రూ.8,02,180, VIP దర్శనాలు రూ.1,80,000, బ్రేక్ దర్శనాలు రూ.1,25,700, కార్ పార్కింగ్ రూ.2,06,000, వ్రతాలు రూ.66,400, ప్రధాన బుకింగ్ రూ.1,34,650, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.22,79,976 ఆదాయం వచ్చింది.

Similar News

News July 9, 2025

వీరవల్లి: మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు

image

మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. వీరవల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. పొట్టిపాడుకు చెందిన జస్వంత్ ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో హాస్టల్‌లో ఉంటున్నాడు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోవడంతో తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News July 9, 2025

5 రోజుల్లో ‘తమ్ముడు’ షేర్ ఎంతంటే?

image

నితిన్ నటించిన ‘తమ్ముడు’ థియేటర్లలో ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. విడుదలైన 5 రోజుల్లో రూ.3 కోట్ల షేర్ మాత్రమే రాబట్టినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. రూ.75 కోట్లతో తెరకెక్కిస్తే థియేట్రికల్ హక్కులు రూ.25 కోట్లకు అమ్ముడుపోగా 12శాతమే రికవరీ అయినట్లు తెలిపాయి. దారుణమైన డిజాస్టర్ అని అభివర్ణించాయి. అంతకుముందు ‘రాబిన్ హుడ్’ కూడా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

News July 9, 2025

23న సిద్దిపేట జిల్లాలో గవర్నర్ పర్యటన

image

సిద్దిపేట జిల్లా కోహెడలో ఈ నెల 23న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ హైమావతి మంగళవారం హెలిప్యాడ్ ల్యాండింగ్ స్థలాన్ని పరిశీలించారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 282 మహిళా సంఘాలకు గవర్నర్ చేతుల మీదుగా స్టీల్ సామాగ్రి (స్టీల్ బ్యాంకు) పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.