News March 28, 2025
యాదగిరి శ్రీవారి నిత్యా ఆదాయ వివరాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. గురువారం 1,400 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.70,000, ప్రసాద విక్రయాలు రూ.8,23,400, VIP దర్శనాలు రూ.1,35,000, బ్రేక్ దర్శనాలు రూ.96,600, కార్ పార్కింగ్ రూ.1,97,000, వ్రతాలు రూ.77,600, యాదరుషి నిలయం రూ.52,172, లీజేస్ రూ.22,92,572, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.39,62,875 ఆదాయం వచ్చింది.
Similar News
News November 21, 2025
అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించండి: ఎంపీ చిన్ని

ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి పనులను సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీ కేశినేని చిన్ని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న పనులపై అధికారులతో ఆయన సమీక్ష చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఆలయ ఛైర్మన్ బొర్రా గాంధీ, ఈవో శీనానాయక్తో కలిసి మహామండపం, కనకదుర్గనగర్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు.
News November 21, 2025
23న పెళ్లి.. స్మృతికి మోదీ గ్రీటింగ్స్

స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 23న ఆమె తన ప్రియుడు పలాశ్ ముచ్చల్తో ఏడడుగులు వేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంధాన-ముచ్చల్ జోడీకి గ్రీటింగ్స్ తెలుపుతూ లేఖ రాశారు. వివాహ బంధంలో ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాగా స్మృతి-పలాశ్ ఎంగేజ్మెంట్ ఇప్పటికే పూర్తయింది.
News November 20, 2025
వికారాబాద్లో టెట్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి- స్పీకర్

జనవరి 3 నుంచి 31, 2026 వరకు జరిగే తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)-2026 అభ్యర్థుల సౌకర్యార్థం వికారాబాద్ జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రత్యేకంగా లేఖ రాశారు.


