News February 3, 2025
యాదాద్రిలో ఈనెల 4న రథసప్తమి వేడుకలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. శ్రీవారిని సూర్యప్రభ వాహనంపై ప్రత్యేక అలంకరణ చేసి ఉ”గం.8.00లకు ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగింపు చేసి, తూర్పు రాజగోపురం వద్ద చతుర్వేద పారాయణం, రథసప్తమి విశిష్టత భక్తులకు ప్రధాన అర్చకులు వివరిస్తారు. రాత్రి 7.00గం.లకు స్వామి వారిని బంగారు రధంపై ఆలయ అంతఃప్రాకారంలో ఊరేగిస్తారు.
Similar News
News February 7, 2025
ఆ రెండ్రోజులు బ్యాంకులు బంద్?

మార్చి 24, 25 తేదీల్లో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు ఆందోళనకు దిగనుండటంతో బ్యాంక్ సేవలకు అంతరాయం కలిగే ఛాన్సుంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలోని 9 యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. వారానికి 2 రోజుల సెలవులు, కొత్త జాబ్స్, DFS రివ్యూను తొలగించడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, రూ.25 లక్షల గ్రాట్యుటీ వరకు IT మినహాయింపు డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యోగులు కోరుతున్నారు.
News February 7, 2025
నల్గొండ: గ్రీవెన్స్ డే.. ఇక నుంచి ‘డయల్ యువర్ సైబర్ నేస్తం’

ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో ఇప్పటినుంచి సైబర్ క్రైమ్కి సంబంధించిన ఫిర్యాదులు కూడా తీసుకోనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ మేరకు ‘డయల్ యువర్ సైబర్ నేస్తం’ అనే కార్యక్రమాన్ని ఈ సోమవారం నుంచే ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు బాధితులు తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.
News February 7, 2025
కాళేశ్వరంలో తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు

కాళేశ్వరంలో ఈనెల 7 నుంచి 9 వరకు మహా కుంభాభిషేకం మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగు నీటి ఏర్పాటు, తాత్కాలిక వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటుగా అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.